పాకిస్థాన్కు చెందిన 13 ఏళ్ల బాలికకు 90 డిగ్రీలు వంగి ఉన్న మెడను నిఠారుగా చేసేందుకు భారత వైద్యుడు విజయవంతంగా శస్త్రచికిత్స చేశారు. ఈ శస్త్రచికిత్స బహుశా ప్రపంచంలోనే మొదటి కేసుగా నిలిచింది. సింధ్ ప్రావిన్స్కు చెందిన పదమూడేళ్ల అఫ్షీన్ గుల్ 10 నెలల వయస్సులో ఉన్నప్పుడు ఆమె సోదరి చేయి నుంచి జారి పడింది, దీంతో ఆమె వెన్నెముకు మీద దగ్గర బలంగా తగలడంతో మెడ బలహీనంగా మారింది. ఆమెను వెంటనే వైద్యుల వద్దకు తీసుకెళ్లినా పరిస్థితి మరింత విషమంగా మారింది. ఆమెకు మందులు ఇచ్చి ఆసరాగా మెడకు బెల్టు మాత్రమే పెట్టగలిగారు. ఆమె పరిస్థితి కారణంగా, ఆమె నడవడం లేదు, మాట్లాడటం లేదు, ప్రతి పనిలో తనకు తల్లి సహాయం అవసరం. తోటి పిల్లలు పాఠశాలకు వెళ్లి ఆడుతుండగా ఆమె ఇంట్లోనే ఉండిపోయింది.
బాలిక పరిస్థితి గురించి మీడియా నివేదికలు ఒక అమెరికన్ సంస్థ దృష్టిని ఆకర్షించాయి. ఆ సంస్థ ఆమెకు ఆపరేషన్ చేయడంలో కుటుంబానికి సహాయం చేయడానికి ఆన్లైన్లో నిధులు సేకరించింది. బ్రిటీష్ రచయిత అలెగ్జాండ్రియా థామస్, అఫ్షీన్ సోదరుడు యాకూబ్ కుంబార్ ను ఢిల్లీలోని అపోలో హాస్పిటల్లో డాక్టర్, సంక్లిష్ట వెన్నెముక శస్త్రచికిత్సలలో నిపుణుడు అయిన డాక్టర్ రాజగోపాలన్ కృష్ణన్తో కలిసేలా చేశారు.
ఆమె కేసు విన్న కృష్ణన్.. అఫ్షీన్ గుల్కు ఉచితంగా ఆపరేషన్ చేసి చికిత్స చేస్తానని భరోసానిచ్చారు.ఈ ఏడాది ఫిబ్రవరిలో, ఆరు గంటల పాటు శస్త్రచికిత్స చేశారు. ఇందుకు నాలుగు శస్త్ర చికిత్సలు చేయాల్సి వచ్చింది. ప్రస్తుతం డాక్టర్ స్కైప్ ద్వారా ఆమెకు వారానికోసారి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రపంచంలో ఇలాంటి కేసు ఇదే మొదటిదని డాక్టర్ చెప్పారు.
ఆమె చికిత్స ఫలితంగా, గుల్ ఇప్పుడు నడుస్తోంది.. మాట్లాడగలుగుతోంది.