భారతదేశ కొత్త ఆర్మీ చీఫ్గా జనరల్ ఉపేంద్ర ద్వివేది బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆయన శ్రీ సరస్వతీ శిశు మందిర్ పూర్వ విద్యార్థి కావడం విశేషం.
1972లో ఉపేంద్ర ద్వివేది … చత్తీస్ గఢ్ రాష్ట్రం అంబికాపూర్ లోని దేవిగంజ్లో ఉన్న సరస్వతీ శిశు మందిర్లో ప్రాథమిక విద్యను అభ్యసించారు. 1972-73 సంవత్సరంలో సరస్వతి శిశు మందిర్ నుండి ఐదవ తరగతి ఉత్తీర్ణత సాధించారు.
చిన్నతనం నుంచి శిశు మందిర్ లో సబ్జెక్టులతో పాటు సదాచారం విలువలు వంట పట్టించుకుని దేశభక్తిని పెంచుకున్నారు. అదే స్ఫూర్తితో 1973లో రేవాలోని సైనిక్ స్కూల్లో అడ్మిషన్ తీసుకున్నారు. ఆ తర్వాత 1981లో NDAలో చేరటం ద్వారా సైన్యం లో ప్రవేశించారు. అంచెలంచెలుగా ఎదిగి ఇప్పుడు భారతీయ సైన్యానికి నాయకత్వం వహిస్తున్నారు.
శ్రీ సరస్వతి శిశు మందిర్ విద్యా వ్యవస్థ పట్ల అమితమైన విశ్వాసాన్ని ఆయన అనేకసార్లు వ్యక్తం చేశారు.