పోలీసుల కళ్లుగప్పి దేశం విడిచి పారిపోబోతున్నఖలిస్తాన్ వేర్పాటువాద నేత అమృత్ పాల్ భార్య కిరణ్ దీప్ కౌర్ ను అమృత్ సర్ విమానాశ్రయంలో పట్టుకున్నారు. దొంగతనంగా లండన్ వెళ్తున్నట్టు గుర్తించారు. అక్కడి అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్ వెళ్లే విమానం ఎక్కబోతుండగా పోలీసులు అడ్డుకుని ఆపేశారు.
గత నెల రోజులుగాఅమృత్ పాల్ భారత్ లోనే పోలీసుల కన్నుగప్పి తిరుగుతున్న సంగతి తెలిసిందే. పంజాబీ గాయకుడు దీప్ సిద్ధు ఏర్పాటు చేసిన వారిస్ పంజాబ్ డే సంస్థకు అమృత్ నాయకత్వం వహిస్తున్నాడు. సంస్థ సభ్యులు కొందరిని ఇప్పటికే అరెస్ట్ చేశారు. అమృత్ పాల్ కోసం చాలా రోజులుగా వెదుతున్నారు. ఈనేపథ్యంలోనే దేశం విడిచి వెళ్లబోతున్న ఆయన భార్య కిరణ్ ను ఇవాళ పట్టుకున్నారు. కిరణ్దీప్ కౌర్పై ఇంతకుముందే లుక్ ఔట్ సర్క్యులర్ను జారీ చేసి వెదుకుతున్నారు. ఈ క్రమంలో
ఏఐ 169 విమానంలో గురువారం ఆమె లండన్ వెళ్లేందుకు ప్రయత్నించారని, ఆమెను అడ్డుకుని ప్రశ్నిస్కున్నట్టు పోలీసు అధికారులు తెలిపారు.