దేశంలో భారీ విరాళాలు పొందుతున్న రాజకీయ పార్టీల్లో ముందువరుసలో ఉంది టీఆర్ఎస్. ప్రాంతీయ పార్టీలకు వస్తున్న విరాళాల్లో దాదాపు 91 శాతం వరకు కేవలం ఐదు పార్టీలకు చేరాయి. ఈసీకి ఆయా పార్టీలు ఇచ్చిన నివేదికలను ఆధారంగా విశ్లేషించిన అసోసియేషన్ ఫర్ డెమొక్రాటిక్ రిఫార్మ్స్ ADR వివరాలు వెల్లడించింది.
2020-21 ఆర్థిక సంవత్సరంలో ప్రాంతీయ పార్టీలు పొందిన సొమ్ములో 91.38 శాతం అంటే రూ.113.79 కోట్లు ఐదు పార్టీలకు చేరాయి. ఆ పార్టీలు జేడీయూ, డీఎంకే, ఆమ్ ఆద్మీ పార్టీ, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్, టీఆర్ఎస్
అయితే 2019-20 ఏడాదిలో పొందిన విరాళాల కన్నా 2020-21లో జేడీయూ, డీఎంకే, టీఆర్ఎస్ కు ఎక్కువరాగా… ఆప్, ఐయూఎంఎల్ కు తక్కువ విరాళాలు వచ్చాయి.
మొత్తం 54 ప్రాంతీయ పార్టీలకు వచ్చిన విరాళాలను విశ్లేషించారు.