దట్టమైన పొగమంచు కారణంగా కేంద్రమంత్రి అమిత్షా ప్రయాణిస్తున్న విమానం అత్యవసరంగా ల్యాండైంది. ఆయన త్రిపుర రాజధాని అగర్తలా వెళ్లాల్సి ఉండగా పొగమంచు వల్ల పైలట్ దారి మళ్లించాడు. అసోం రాజధాని గువాహటి లోని లోక్ ప్రియ గోపీనాథ్ బోర్డోలాయ్ విమానాశ్రయంలో దిగింది. ఈ ఏడాది త్రిపుర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అందులోభాగంగా ఆయన గురువారం అగర్కలానుంచి రెండు రథయాత్రలు ప్రారంభించాల్సి ఉంది. అయితే ఆయన కార్యక్రమాలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని పార్టీ వర్గాలు తెలిపాయి.