పాపులర్ ఫ్రంట్ ఆ ఫ్ ఇండియా (PFI)కి ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నట్లు తేలిన నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. దాదాపు 10 రాష్ట్రాల్లో సుమారు 100 మంది పీఎఫ్ఐ కార్యకర్తలను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
వివిధ ఇతర సంస్థలతో కలిసి సుమారు 10 రాష్ట్రాల్లో నిర్వహించిన దాడుల్లో దాదాపు 100 మంది పీఎఫ్ఐ కార్యకర్తలను అరెస్ట్ చేసింది.
కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణా, బిహార్, ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీలలో ఈ దాడులు జరిగాయి.
అరెస్టయినవారిలో పీఎఫ్ఐ చైర్మన్ ఓఎంఏ సలామ్, ఢిల్లీ పీఎఫ్ఐ చీఫ్ పర్వేజ్ అహ్మద్, ఉత్తర ప్రదేశ్ పీఎఫ్ఐ మాజీ కోశాధికారి నదీం కూడా ఉన్నారు. గతంలో పౌరసత్వ సవరణ చట్టం, ఎన్ఆర్సీ వ్యతిరేక నిరసనల్లో కూడా చురుగ్గా వ్యవహరించినట్లు తెలుస్తోంది. హైదరాబాద్, మహారాష్ట్రలోని ఔరంగాబాద్ నగరాల్లో ఉన్న పీఎఫ్ఐ కార్యాలయాలకు ఎన్ఐఏ సీలు వేసింది. ఇదిలావుండగా, కేరళలో ఆందోళనకు దిగిన కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు.
పీఎఫ్ఐకి నేరుగా పాకిస్థాన్తో సంబంధాలు ఉన్నాయని ప్రమాదకర సంస్థ అని పోలీసులంటున్నారు. ఈ సంస్థకు ఇండియన్ ముజాహిదీన్తో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయి. పీఎఫ్ఐకి అరబ్, గల్ఫ్ దేశాల నుంచి నిధులు అందుతున్నట్టు తేలింది.