సీఏఏ అమలుచేసేది ఎప్పుడో చెప్పేసిన అమిత్ షా
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సీఏఏ చట్టాన్ని త్వరలోనే అమలు చేయబోతున్నట్లు కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలిపారు. దేశంలో వ్యాక్సినేషన్ డ్రైవ్ పూర్తయిన వెంటనే పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు చేస్తామన్నారు. సీఏఏ చట్టం ద్వారా.. వెస్ట్ బెంగాల్లో నివసిస్తున్న మతువా తెగతో పాటు.. ఇతర శరణార్దులకు భారత పౌరసత్వం ఇస్తామని హామీ ఇచ్చారు. వెస్ట్ బెంగాల్లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో బీజేపీ పరివర్తన్ యాత్ర చేపడుతోంది. ఈ సందర్భంగా మాట్లాడిన అమిత్ షా.. రాష్ట్రంలో జరగబోయే ఎన్నికలు మోదీ అభివృద్ధి మోడల్కు మమతా బెనర్జీ వినాశక మోడల్కు మధ్యే పోటీ ఉంటుందన్నారు. అంతుకుముందు ఓ సభలో దీదీ భవిష్యత్తుపై జోస్యం చెప్పారు. మే నెల తర్వాత దీదీ సీఎం పీఠం నుంచి దిగిపోతుందని.. 200 సీట్లకు పైగా బీజేపీ దక్కించుకుని.. అధికారం చేపట్టబోతుందన్నారు.