హోంమంత్రి అమిత్ షా ఇవాళ న్యూఢిల్లీలోని ప్రధానమంత్రి సంగ్రహాలయాన్ని సందర్శించారు. సతీమణితో కలిసి వెళ్లారు షా. సంగ్రహాలయాన్ని గత నెలలో ప్రధాని మోదీ ప్రారంభించారు. దీనిని ఢిల్లీలోని తీన్ మూర్తి ఎస్టేట్లో నిర్మించారు. దేశం కోసం సేవలందించిన మొత్తం 14 మంది మాజీ ప్రధానుల జీవితాలు, వారి సేవలను ఈ సంగ్రహాలయం కవర్ చేస్తుంది. మ్యూజియంలో మొత్తం 43 గ్యాలరీలు ఉన్నాయి.
ఈ భవనం మాజీ ప్రధాన మంత్రి లాల్ బహదూర్ శాస్త్రి గ్యాలరీతో ప్రారంభమవుతుంది. అన్ని ప్రధాన మంత్రుల చరిత్రను కవర్ చేస్తుంది. చివరగా ఏప్రిల్ 2014 వరకు భారత ప్రధానిగా ఉన్న డాక్టర్ మన్మోహన్ సింగ్ గ్యాలరీతో ముగుస్తుంది.
హోలోగ్రామ్లు, వర్చువల్ రియాలిటీ, ఆగ్మెంటెడ్ రియాలిటీ, మల్టీ-టచ్, మల్టీ-మీడియా, ఇంటరాక్టివ్ కియోస్క్లు, కంప్యూటరైజ్డ్ కైనటిక్ శిల్పాలు, స్మార్ట్ఫోన్ అప్లికేషన్లు, ఇంటరాక్టివ్ స్క్రీన్లు సహా ఎక్స్పీరియన్షియల్ ఇన్స్టాలేషన్లు ఎగ్జిబిషన్లో పొందుపర్చిన సమాచారాన్ని అందంగా చూపించడానికి వీలు కల్పిస్తాయి.