హోంమంత్రి అమిత్ షా కెమెరామన్ అయ్యారు. అరుణాచల్ ప్రదేశ్ పర్యటన సందర్భంగా ఆయన తన కెమెరాకు పని చెప్పారు. ఆ ఈశాన్య రాష్ట్రపు సహజసిద్ధ అందాల్ని బంధించారు. అమిత్ షా అరుణాచల అందాల వీడియోను ప్రధాని మోదీ తన సోషల్మీడియా అకౌంట్లనుంచి షేర్ చేశారు. అమిత్ షా రికార్డ్ చేసిన వీడియోలు చూడండి, ఎంత అందమైన దృశ్యాలివి అంటూ ఆయన ట్విట్టర్, ఫేస్ బుక్ లో షేర్ చేశారు. ఏప్రిల్ 10న హోంమంత్రి అరుణాచల్ ప్రదేశ్లో పర్యటించిన సంగతి తెలిసిందే. ITBP సరిహద్దు అవుట్పోస్ట్ను పరిశీలించారు. అయితే ఆయన పర్యటనపట్ల చైనా అభ్యంతరం వ్యక్తం చేసింది. అరుణాచల్ లోని ఆ భూభాగం తమదని చైనా వాదిస్తోంది. అయితే చైనా వాదనను తప్పుపట్టిన భారత్… అరుణాచల్ ప్రదేశ్ భారత్లో అంతర్భాగమని, విడదీయరాని భాగమని ఆ వాస్తవాన్ని చైనా గ్రహించాలని గట్టిగానే బదులిచ్చింది.