కాంగ్రెస్ పార్టీపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేశారు. అసోం అసెంబ్లీ ఎన్నికల పర్యటనలో భాగంగా ఆయన కుమ్రప్ ప్రాంతంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసంగించిన అమిత్ షా.. కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. ప్రజల్లో విద్వేశాలు రెచ్చగొడుతూ.. మత పరంగా విభజించాలని కాంగ్రెస్ పార్టీ చూస్తోందన్నారు. అసోం ప్రజల్ని కూడా హిందూ- ముస్లిం అంటూ విడదీసేలా ప్రయత్నాలు చేస్తుందని ఆరోపించారు. అన్ని వర్గాల ప్రజల శ్రేయస్సు కోసం బీజేపీ ముందుకు వెళ్తుంటే.. కాంగ్రస్ పార్టీ మాత్రం ప్రజల్లో చీలికలు తెచ్చే రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు.
బోడో-నాన్ బోడో, అస్సామీ-బెంగాలీ, హిందూ-ముస్లిం, ఎగువ అస్సాం-దిగువ అస్సాం, గిరిజన-గిరిజనేత.. ఇలా అసోంలోని ప్రజల్ని విడదీస్తూ కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ ప్రధాని మోదీ మాత్రం ‘సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్’అనే నినాదంతో ప్రజల్ని ఏకం చేస్తున్నారన్నారు.