కేంద్రమంత్రి అమిత్ షా అండమాన్ నికోబార్లో పర్యటిస్తున్నారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా… పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. శుక్రవారం పోర్ట్ బ్లైర్లోని నేషనల్ మెమోరియల్ సెల్యులార్ జైలును అమిత్ షా సందర్శించారు. స్వాతంత్ర్య పోరాట సమయంలో బ్రిటీష్ పాలకులు వీర్ సావర్కర్ ను ఉంచిన సెల్ను సందర్శించి నివాళులర్పించారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా సాంస్కృతిక కార్యక్రమానికి కేంద్ర మంత్రి అమిత్ షా హాజరయ్యారు. అండమాన్ సెల్యూలార్ జైలును సావర్కర్ ఒక పవిత్ర క్షేత్రం (తీర్థ స్థాన్)లా మార్చేశారని షా అన్నారు. నాడు సావర్కర్ ఉన్న సెల్ను సందర్శించి, ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పిస్తుంటే తాను ఎంతో భావోద్వేగానికి లోనయ్యానని అమిత్ షా ట్వీట్ చేశారు.