తెలంగాణ బీజేపీ నాయకులతో కేంద్రహోంమంత్రి అమిత్షా ఇవాళ ప్రత్యేకంగా సమావేశమయ్యారు..పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా సమావేశంలో పాల్గొన్నారు. తెలంగాణలో తాజా పరిణామాలు, పార్టీ భవిష్యత్ కార్యాచరణ, ఎన్నికల వ్యూహాలపై దాదాపు రెండుగంటలపాటు చర్చించారు. పార్టీ చీఫ్ బండిసంజయ్, సీనియర్ నేతలు కిషన్ రెడ్డి, డీకే అరుణ, ఈటల రాజేందర్, వివేక్, విజయశాంతి, జితేందర్ రెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు..