ఛత్తీస్గడ్లో ఆదివారం చోటుచేసుకున్న భారీ ఎన్కౌంటర్ గురించి తెలిసిందే. ఈ ఘటనలో 21 మంది జవాన్లు అమరులవ్వగా.. వారిలో 14 మంది జవాన్ల మృతదేహాలు లభ్యమయ్యాయి. మరో 31 మంది జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో అమరులైన జవాన్లకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ భగేల్ నివాళులర్పించారు. జవాన్ల పార్థివదేహాల వద్ద పుష్పాంజలి ఘటించారు. అనంతరం రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. జగద్లపూర్లో 14 మంది జవాన్ల మృతదేహాలను ఉంచగా.. ఇంకా మిగతా జవాన్ల మృతదేహాలు లభ్యం కావాల్సి ఉంది.
నివాళుల కార్యక్రమం పూర్తయిన తర్వాత నక్సల్ జరిపిన కాల్పుల్లో గాయపడి చికిత్స పొందుతు్న జవాన్లను పరామర్శించారు. ఆ తర్వాత ఛత్తీస్గడ్ పోలీస్ ఉన్నతాధికారులతో అత్యున్నత సమావేశం నిర్వహించారు. ఈ మీటింగ్లో సీఎం భూపేష్ భగేల్ కూడా పాల్గొన్నారు. మావోయిస్టుల కట్టడికి ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై చర్చించారు.
Chhattisgarh: Union Home Minister Amit Shah and Chief Minister Bhupesh Baghel lay wreath at the coffins of 14 security personnel who lost their lives in the Naxal attack, in Jagdalpur. https://t.co/vlDGKokhVe pic.twitter.com/MQjHOY0RIq
— ANI (@ANI) April 5, 2021
Chhattisgarh: Union Home Minister Amit Shah and CM Bhupesh Baghel hold a meeting with top officials in Jagdalpur, over the naxal attack in which 14 security personnel lost their lives. pic.twitter.com/sF5FPp4Hr8
— ANI (@ANI) April 5, 2021