పశ్చిమబెంగాల్ పర్యనటలో ఉన్న కేంద్రహోంమంత్రి అమిత్ షా శుక్రవారం రాత్రి బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఇంట్లో డిన్నర్ చేశారు. తనింటికి వచ్చిన అమిత్ షాకు దాదా సాదర స్వాగతం పలికారు. అయితే గంగూలీ ఇంటికి షా విందుకు వెళ్లడం చర్చనీయాంశమైంది. ఈ సందర్భంగా కేంద్ర హోంమంత్రిని చూసేందుకు చుట్టుపక్కల ప్రజలు తరలివచ్చారు. షాతో విందులో గంగూలీ కుటుంబసభ్యులంతా పాల్గొన్నారు.
అమిత్ షా గంగూలీ ఇంటికి వెళ్తున్న విషయం ముందుగానే మీడియాకు తెలిసింది. అమిత్ షా తనింటికి వస్తుండడం వెనక ఎలాంటి రాజకీయ కారణాల్లేవని, షా తనకు ఎంతోకాలంగా తెలుసనీ అన్నారు. బీసీసీఐ కార్యదర్శిగా ఉన్న అమిత్షా కుమారుడు జైషా తనకు మంచి మిత్రుడనీ గుర్తు చేశారు గంగూలీ. ఇప్పటికే గంగూలీ బీజేపీలో చేరనున్నారనే వార్తల నేపథ్యంలో అమిత్ షా స్వయంగా ఆయనింటికి వెళ్లడం ఆసక్తిగా మారింది.