కేంద్ర హోంమంత్రి అమిత్ షా శనివారం నుంచి రెండు రోజుల అరుణాచల్ ప్రదేశ్ పర్యటనకు వెళ్లనున్నారు. మే 21, 22 తేదీల్లో ఈశాన్య రాష్ట్రంలో రెండు రోజుల పర్యటనలో భాగంగా హోం మంత్రి బహిరంగ కార్యక్రమాలకు హాజరవుతారు, వివిధ అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. అంటే కాకుండా ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITB), సశాస్త్ర సీమా బల్ (SSB) సిబ్బందితో సంభాషిస్తారు.
హోంమంత్రి శనివారం ఉదయం 11.40 గంటలకు తన మొదటి రోజు పర్యటనలో భాగంగా అరుణాచల్ ప్రదేశ్లోని తిరాప్ జిల్లాలో ‘స్వర్ణ జయంతి సమరోహ్’కు హాజరుకానున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం 2.45 గంటలకు లోహిత్ జిల్లాలోని పరశురామ్ కుండ్ను సందర్శిస్తారు.
రెండో రోజు, షా అరుణాచల్ ప్రదేశ్లోని నంసాయ్ పట్టణంలో ఉదయం 9.30 గంటలకు సామాజిక సంస్థలతో సమావేశమై, ఆ ప్రాంతంలోని గోల్డెన్ పగోడా టెంపుల్లో ప్రార్థనలు చేస్తారు. అనంతరం బహిరంగ సభకు హాజరై ఉదయం 11 గంటలకు నంసాయి ప్రాంతంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత షా అక్కడి భద్రత, అభివృద్ధిని సమీక్షిస్తారు. నంసాయ్లో ఆర్మీ, ITBP, SSB, అస్సాం రైఫిల్స్, బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ సహా నేషనల్ హైవేస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (NHIDLC) సిబ్బందితో సంభాషిస్తారు.
అనంతరం ఆయన బడా ఖానా(అన్ని ర్యాంకుల ఆర్మీ సిబ్బంది, CAPF దళాల సామూహిక భోజనం)లో పాల్గొంటారు.