అరుణాచల్ ప్రదేశ్ లో రెండు రోజుల పర్యటన సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా శనివారం తిరప్ జిల్లాలోని నరోత్తమ్ నగర్ రామకృష్ణ మిషన్ ఆశ్రమాన్ని సందర్శించారు. అక్కడ షా వివిధ కార్యక్రమాలకు హాజరై అనేక అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తారు.
“రెండు రోజుల పర్యటన కోసం అరుణాచల్ ప్రదేశ్కు బయలుదేరుతున్నాను. భారతదేశంలోని ఈ అందమైన ప్రాంతంలో వివిధ కార్యక్రమాలకు హాజరయ్యేందుకు ఎదురు చూస్తున్నా” అని అమిత్ షా ట్వీట్ చేశారు.
https://twitter.com/AmitShah/status/1527846139575545857?s=20&t=BHf5kXk21wKyVK_8L7-FSw
తన పర్యటనలో షా బహిరంగ కార్యక్రమాలకు హాజరవుతారు, వివిధ అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. అలాగే ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP), సశాస్త్ర సీమా బల్ (SSB) సిబ్బందితో సంభాషిస్తారు. అరుణాచల్ ప్రదేశ్లోని లోహిత్ జిల్లాలోని పరశురామ్ కుండ్లో 51 అడుగుల భగవాన్ పరశురాముడి విగ్రహానికి హోంమంత్రి శంకుస్థాపన చేయనున్నారు.
https://twitter.com/AmitShah/status/1527919153138782208?s=20&t=BHf5kXk21wKyVK_8L7-FSw
రెండవ రోజు, షా అరుణాచల్ ప్రదేశ్లోని నంసాయ్ పట్టణంలో ఉదయం 9.30 గంటలకు సామాజిక సంస్థలతో సమావేశమై, ఆ ప్రాంతంలోని గోల్డెన్ పగోడా టెంపుల్ కు వెళతారు. ఆదివారం ఉదయం 11 గంటలకు నంసాయి ప్రాంతంలో జరిగే బహిరంగ సభలో హాజరై, వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు హోంమంత్రి హాజరవుతారు.
https://twitter.com/AmitShah/status/1527985288769077255?s=20&t=BHf5kXk21wKyVK_8L7-FSw