2024లో కూడా మోడీ అధికారంలోకి వస్తాడు అని బహుశా అమెరికా ఫిక్స్ అయిపోయినట్లే ఉంది.
ఎందుకంటే, 2014 నుండి ఎప్పుడూ ఘాటుగా విమర్శలు చేసే అమెరికా మీడియా కూడా ఈ మధ్య స్వరం మార్చింది. బిజెపి ప్రభుత్వం మీద ఈ మధ్య అనుకూల వ్యాసాలు రాస్తోంది. ఇంకా చెప్పాలి అంటే గతంలో ఎక్కువగా భారతీయ జర్నలిస్టుల బిజెపి వ్యతిరేక వ్యాసాలు వస్తూ ఉంటే ఇప్పుడు అమెరికన్ కాలమిస్టుల రాస్తున్న అనుకూల వ్యాసాలు వస్తున్నాయి.
ఈ మధ్యే ‘ ద ఎకనమిస్ట్’ లో వ్యాసం వచ్చిన తరువాత ఈ కోవలెనే తాజాగా ‘వాల్ స్ట్రీట్ జర్నల్’ లో సీనియర్ కాలమిస్ట్ వాల్తేర్ రస్సెల్ మీడ్ బిజెపి మీద ఒక వ్యాసం రాసారు.
దానిలో క్లుప్తంగా …
- అమెరికన్ జాతీయ ప్రయోజనాల దృక్కోణం నుండి చూస్తే, భారతదేశం యొక్క అధికార భారతీయ జనతా పార్టీ, ప్రపంచంలో అత్యంత ముఖ్యమైన విదేశీ రాజకీయ పార్టీ. ఇది తక్కువగా అర్ధం చేసుకోబడ్డ పార్టీ.
- 2014లో అధికారంలోకి వచ్చి, 2019లో రెండోసారి గెలిచి, 2024లో మళ్లీ విజయం సాధించే దిశగా దూసుకుపోతున్న బీజేపీ.
- భారత్ ఆర్థికంగా అగ్రగామిగా ఎదుగుతున్న తరుణంలో, అమెరికా ఇండో-పసిఫిక్ వ్యూహం లో భారత్ జపాన్ తో కలిసి ఇరుసుగా వుండే పరిస్థితులలో, భారత రాజకీయాలకు సారధ్యం వహిస్తున్న ఈ పార్టీ అమెరికాకు చాలా ముఖ్యం.
- రాబోయే కాలంలో, పెరుగుతున్న చైనా శక్తిని సమతుల్యం చేయడానికి బిజెపి ఏలుబడిలో ఉండే భారత్ ని అమెరికా ఉపేక్షించలేదు.
- భారతీయులు కాని వారికి అవగాహన లేని రాజకీయ, సాంస్కృతిక చరిత్ర నుండి ఆ పార్టీ పెరిగింది. అందుకే ఆ పార్టీని, దాని జాతీయవాద ఉద్యమాన్ని ఇతరులు అర్ధం చేసుకోలేరు.
- బిలియన్ దాటి ప్రజలు ఉన్న చైనా లాగే ఇప్పుడు భారత్ కూడా సూపర్ పవర్ గా ఎదగాలి అనుకుంటోంది.
- కొన్ని పాశ్చాత్య ఉదారవాద విషయాలను బిజెపి వ్యతిరేకించినప్పటికీ, చాలా ఆధునిక భావాలు స్వీకరించింది.
- అమెరికన్ విశ్లేషకులు, ముఖ్యంగా వామపక్ష-ఉదారవాదులు తరచుగా నరేంద్ర మోడీ భారతదేశాన్ని చూసి, అది డెన్మార్క్ లాగా ఎందుకు లేదు అని అడుగుతారు. అయితే, వారి అంచనాలు పూర్తిగా తప్పు.
- అలాగే బిజెపి దళిత, మైనార్టీ వ్యతిరేకత అని చెప్పుకుంటే క్రిస్టియన్ లు అధిక జనాభా గల ఈశాన్య రాష్ట్రాల్లో గెలిచింది, యూపీలో షియా ముస్లిమ్స్ మద్దత్తు లభిస్తోంది. RSS కుల వివక్షపై పోరాడుతోంది.
- నేను చాలా మంది సీనియర్ బిజెపి, RSS కలిసిన తరువాత, నాకు అర్ధం అయింది ఏమిటంటే పాశ్చాత్యులు ముఖ్యంగా అమెరికన్లు ఇంకా ఎక్కువగా ఈ ఉద్యమాన్ని అర్ధం చేసుకోడానికి ప్రయత్నించాలి.
- అన్ని రంగాల్లో ఉన్న వేల మంది వాలంటీర్లు ద్వారా RSS గ్రామాల్లో, పట్టణాల్లో సామాజిక, ఆధ్యాత్మిక, విద్యా రంగాల్లో కృషి చేస్తూ ప్రజలని బాగా ప్రభావితం చేస్తూ చైతన్య పరుస్తూ వారి శక్తి యుక్తులను కేంద్రీకరించే పని చేస్తోంది.
- ఈ ఉద్యమం లో బాగా రాడికల్ గా చెప్పబడి, మోడీ తరువాత ప్రధానిగా చెప్పబడుతున్న యోగి ఆదిత్యనాధ్ ని కలిశాను. అతను రాష్ట్రానికి పెట్టుబడులు,రాష్ట్ర అభివృద్ధి గురించి మాత్రమే మాట్లాడాడు. అలాగే RSS చీఫ్ మోహన్ భగవత్ కూడా భారత్ అభివృద్ధి గురించే చెపుతూ దేశంలో మైనార్టీలు ఇబ్బంది పడతారు అనేది తోసిపుచ్చారు.
- నా వంటి వారితో మాట్లాడిన ఈ మాటలు క్రింద వారికి ఎంత వరకు చేరుతాయో ఊహించలేం, కానీ పార్టీ నాయకత్వం మాత్రం తమ సామాజిక, సాంస్కృతిక మూలాలు వదిలేయకుండా ప్రపంచ దేశాలతో ఇంకా లోతుగా ఉపయుక్తంగా సంభాషించాలి అని అనుకుంటోంది.
చివరిగా, చైనా తో ఘర్షణలు పెరుగుతున్న ఈ పరిస్థితులలోనూ, రాజకీయ మరియు ఆర్ధిక అవసరాలు దృష్ట్యా అమెరికా కు భారత్ వంటి మిత్ర దేశ అవసరం ఉంది. అందుకే అమెరికన్ రాజకీయ నాయకులు, వ్యాపారస్తులు మేధావులు ఈ హిందూ జాతీయ వాద ఉద్యమాన్ని అర్ధంచేసుకునేందుకు ప్రయత్నించాలి.
- ఈ కాలమిస్ట్ వాల్టర్ రస్సెల్ మీడ్ హడ్సన్ ఇన్స్టిట్యూట్లో స్ట్రాటజీ అండ్ స్టేట్స్మన్షిప్లో రావెనెల్ బి. కర్రీ III విశిష్ట సహచరుడు, వాల్ స్ట్రీట్ జర్నల్లో గ్లోబల్ వ్యూ కాలమిస్ట్ మరియు న్యూయార్క్లోని బార్డ్ కాలేజీలో జేమ్స్ క్లార్క్ చేస్ ఫారిన్ అఫైర్స్ అండ్ హ్యుమానిటీస్ ప్రొఫెసర్.
….చాడా శాస్త్రి…