గిల్గిట్- బాల్టిస్తాన్ భారత్ నియంత్రణలో ఉండి..బలూచిస్తాన్ స్వతంత్రంగా ఉంటే ఆఫ్గన్ లో అమెరికా సేనలు అలాగే ఉండేవని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు అగ్రదేశపు రిపబ్లికన్ నాయకుడు బాబ్ లాన్సియా. అంతేకాదు అరేబియా సముద్రపు ఓడరేవుల్లోకి రాకుండా తన ప్రత్యర్థి అయిన చైనాను అమెరికా నిలువరించగలిగి ఉండేదని… అప్పుడు చైనాకు, చైనా బెల్ట్ & రోడ్ల ప్రాజెక్టుకు చెక్ పడేదనీ అన్నారు. ఆఫ్గన్ నుంచి సేనల ఉపసంహరణకు భారత్ కు ఏం సంబంధం లేకున్నా… భౌగోళికంగా భారత భాగస్వామ్యం ఉంటే పరిస్థితులు భిన్నంగా ఉండేవన్నారు. అసలు బలూచ్ స్వతంత్రంగా ఉండి.. గిల్గిట్- బాల్టిస్తాన్ భారత్ లో ఉంటే డబుల్ గేమ్ ఆడుతున్న పాకిస్తాన్ పై అమెరికా ఆధారపడాల్సి వచ్చేదే కాదన్నారు. బాబ్
https://twitter.com/BobLancia/status/1534171153031364609?s=20&t=40Ppk7DieZchetA1pXnvVw
లాన్సియా మాజీ నేవీ అధికారి.. రిపబ్లికన్ పార్టీ వాడైన లాన్సియా …రోడ్ ఐలాండ్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ మాజీ సభ్యుడు . ఈ ఏడాది నవంబర్లో జరగనున్న యునైటెడ్ స్టేట్స్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ఎన్నికలలో పోటీ చేస్తున్నారు.
భారత్ గురించి ఇంకా పలు కీలకవ్యాఖ్యలే చేశారు లాన్సియా. దక్షిణాసియా ప్రయోజనాలు కాపాడడంలో భారత్ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోందని ట్వీట్ చేశారు. బలూచిస్తాన్ స్వతంత్రంగా ఉంటే బాగుండేదంటూ… ఆఫ్ఘన్ కు అమెరికా సరఫరా చేసిన ఆయుధాలను కశ్మీర్లో అస్థిరత సృష్టించేందుకు పాకిస్తాన్ వాడుకుందనీ అన్నారు. డబుల్ గేమ్ ఆడుతున్న పాకిస్తాన్పై ఆధారపడకుండా మా దళాలను పంపడానికి స్వతంత్ర బలూచిస్తాన్…ఆఫ్గన్లోకి ప్రత్యక్ష ప్రవేశానికి సహకరించి ఉండేది. గిల్గిట్-బాల్టిస్తాన్ భారతదేశంలో భాగమైతే, భారతదేశం నుండి కూడా US టూప్స్ సరఫరా జరిగేదని ఆయన అన్నారు. పాక్ పై ఆధారపడకుండా స్నేహపూర్వక ప్రజాస్వామ్యమైన భారతదేశం నుంచి ట్రూప్స్ వెళ్లేవనీ ఆయన వ్యాఖ్యానించారు. పాకిస్తాన్ ఆక్రమిత ప్రాంతం అయిన గిల్గిత్ బాల్టిస్తాన్ ప్రాంతం ఇస్లామిక్ రిపబ్లిక్ను …చైనాతో కలుపుతుంది. అదే భారత్ లో కనుక ఉంటే… పాకిస్తాన్ తో నేరుగా కలిసే చైనా బెల్ట్-అండ్-రోడ్ ప్రాజెక్ట్ను నిరోధించి ఉండేదని…. అంతేకాకుండా, ఆఫ్ఘన్ మిషన్ కోసం ఉపయోగించాల్సిన సైనిక సామాగ్రిని నేరుగా భారతదేశంలో ఉంచేలా యూఎస్ కు సాయం అందేదనీ అన్నారు.
https://twitter.com/BobLancia/status/1534171747620093953?s=20&t=40Ppk7DieZchetA1pXnvVw
మార్చి 2020లో అమెరికా తన సైన్యాన్ని ఆఫ్ఘనిస్తాన్ నుండి ఉపసంహరించుకోవడం ప్రారంభించిన వెంటనే, తాలిబాన్లు ఒకదాని వెంట మరొకటిగా అన్ని నగరాలను స్వాధీనం చేసుకున్నాయి. గతేడాది ఆగస్టు 15న కాబూల్ను ఇస్లామిక్ గ్రూప్ ఆక్రమించింది. తాలిబాన్ ఆఫ్ఘనిస్తాన్లోని చాలా ప్రావిన్సులను స్వాధీనం చేసుకుని పాలనాపగ్గాలు చేతిలోకి తీసుకుంది. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ దానిని సమర్థించారు, ఆఫ్ఘనిస్తాన్లో US మిషన్ ఎప్పుడూ దేశ నిర్మాణం లేదా ఏకీకృత, కేంద్రీకృత ప్రజాస్వామ్యాన్ని సృష్టించడం గురించి కాదు కానీ ఎప్పుడూ అమెరికాలో ఉగ్రదాడిని నిరోధించడమే .
2001లో అల్ ఖైదా 9/11 ఉగ్రవాద దాడుల తర్వాత అమెరికా ఆఫ్ఘనిస్తాన్పై దాడి చేసింది. ఆఫ్ఘనిస్తాన్ యుద్ధం 20 సంవత్సరాలు కొనసాగింది. చివరకు తాలిబాన్ ఇస్లామిస్ట్ పాలనకు ముందు అమెరికా దేశాన్ని వదులుకుంది.