మంచు తుఫాన్తో అతలాకుతలమవుతున్న అమెరికా
అగ్రరాజ్యం అమెరికాను మంచు తుఫాన్ అతలాకుతలం చేస్తోంది. పలు రాష్ట్రాల్లో ఈ తుఫాన్ బీభత్సాన్ని సృష్టిస్తోంది. ఇప్పటికే ఇరవై మందికి పైగా చనిపోయారు. టెక్సాస్, లూసియానా, మిసిసిప్పి ప్రాంతాల్లో మంచు తుఫాన్ ధాటికి విద్యుత్తు గ్రిడ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీంతో ఆయా నగరాల్లో దాదాపు 30 లక్షల మంది వరకు చీకట్లో ఉన్నారు. అధికారులు విద్యుత్తు పునరుద్ధరణకు ప్రయత్నిస్తున్నప్పటికీ.. మంచు తుఫాన్ ప్రభావంతో ఆటంకం కల్గుతోంది.
నగరాల్లో విద్యుత్ సరఫరా ప్రక్రియ ప్రారంభం అయ్యేందుకు మరింత సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు. ఈ ప్రాంతాల్లో -22 డిగ్రీల కంటే కూడా తక్కువ ఉష్ణోగ్రత నమోదవుతుందన్నారు. అయితే కరెంట్ సరఫరా లేకపోవడంతో ఇళ్లల్లో ప్రజలు వేడి కాచుకోవాడానికి తీవ్ర ఇబ్బుందులు ఎదుర్కొంటున్నారు. ఇళ్లలో వేడి కోసం పెడుతున్న నిప్పుతో అగ్ని ప్రమాదాలు సంభవిస్తున్నాయని.. దీంతో పలువురు ప్రాణాలు కోల్పోతున్నారని తెఇల అధికారులు చెబుతున్నారు. ఈ మంచు తుఫాన్ ప్రభావం దాదాపు 10 కోట్ల మందిపై ఉంటుందని.. టెక్సాస్కు మరో మంచు తుఫాన్ ముప్పు కూడా పొంచి ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. ఇప్పటికే టెక్సాస్లో జనజీవనం పూర్తిగా స్తంభించింది. కాగా, మంచు తుఫాన్ ప్రభావం ఉన్న నగరాల్లో వందల విమాన సర్వీసులు రద్దయ్యా యి. అంతేకాదు కరోనా వ్యాక్సినేషన్కు కూడా అంతరాయం ఏర్పడింది.