ఆరోగ్య సమస్యలపై, ముఖ్యంగా కోవిడ్ మహమ్మారితో పాటు యుఎస్ రాజకీయాలు, ప్రభుత్వం మరియు సంస్కృతి మొదలగు విషయాలపై విశేష అధ్యయనం చేసే జోయెల్ ఎస్. హిర్షోర్న్ అమెరికాదేశానికి చెందిన రచయిత కోవిడ్ మహమ్మారిపై వ్రాసిన ఒక వ్యాసంలోని కొన్ని ఆసక్తికరంలైన విషయాలను అందులో భారత దేశానికీ సంబంధించిన విషయాలు;అట్లాగే భారత్ చేస్తున్న ప్రయత్నాలుఈ వ్యాసంలోగమనిద్దాము. . . . . . .
కోవిద్ -19 అంటువ్యాధి నియంత్రణలో పోటీ నిర్మాణము చేయటానికి అమెరికా దేశంలో మాస్కింగ్ మరియు లాక్డౌన్లు మరియు టీకాలు వంటి వాటికీ అవసరానికి మించి ప్రాధాన్యతనిచ్చిఆవశ్యకమైన హైడ్రాక్సీక్లోరోక్విన్ మరియు ఐవర్మెక్టిన్ వాడకం ను ఫ్రంట్లైన్ వైద్యుల నుండి వాస్తవ ప్రపంచ విస్మరించింది, పైగా దాని పై రకరకాల కథనాలు ప్రచారం చేసింది. ప్రాధాన్యత లేని వాటితో పెద్దఎత్తున వ్యాపారం ప్రారంభమైనది, ఫైజర్ కంపెనీచేసిన ప్రకటన ప్రకారం తన COVID-19 వ్యాక్సిన్ అమ్మకాలు రికార్డు స్థాయిలో 26 బిలియన్లకుడాలర్లకు చేరుకొన్నది. ఇది ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడైన COVID-19 వ్యాక్సిన్ గ పేర్కొన్నది ; మిగిలిన ఇతర టీకా ఉత్పత్తిదారుల అమ్మకాలు కూడా మరన్ని బిలియన్లను ఉంటాయి .కానీ చౌకైన జనరిక్ మెడిసిన్ తయారీకి విస్తృత వినియోగాన్ని ప్రోత్సహించడానికి కావాల్సిన ఆర్థిక ప్రోత్సాహం చేయలేదు ఎందుకు ?. ఇదొక పెద్దప్రశ్న. అమెరికాలో కోవిద్ మరణాలు 580,000 చేరుకున్నప్పుడు అమెరికా ముందు జాగ్రత్త తీసుకొని చౌకైన జనరిక్ మెడిసిన్స్ పై దృష్టిపెట్టి ఉంటే నష్టం అంత తీవ్రంగా ఉండేది కాదు ఎందుకు దృష్టి పెట్టలేదు? అదే భారతదేశం గత సంవత్సరం కరోనా సమయంలో రెండు జనరిక్ medicines ఉపయోగించి కరోనాను అదుపు చేయగలిగింది. భారతదేశం 28 రాష్ట్రాలు1.4 బిలియన్ జనాభా ఉన్నదేశం.గత సంవత్సరం నుండి చేస్తున్న ప్రయత్నాల కారణంగా ఫిబ్రవరి 2021 నాటికి పరిస్థితులుపూర్తిగా అదుపులోకి వచ్చేఅవకాశలు కనబడ్డాయి, ఎందుకంటే టీకా ఉత్పత్తిలోభారత్ అమెరికా తరువాత రెండవ స్థానంలో ఉంది. COVID ను నివారించడానికి ఐవర్మెక్టిన్ను విజయవంతంగా ఉపయోగంలోకి తెచ్చింది అకస్మాత్ గా మే 1నాటికీ కోవిద్ కేసులు నాలుగు లక్షలకు చేరుకొంది. ఆ సమయంలో అమెరికా దేశ ప్రధాన వైద్య సలహాదారు ఆంథోనీ ఫౌసీ,భారత్ పరిస్థితి యుద్ధం లాంటిదని చెప్పారు మొత్తంమీద భారత్ పరిస్థితి పెద్ద విజయం నుండి పెద్ద విపత్తువైపు ఎందుకు మళ్లింది అనే విషయంపై సరియైన విశ్లేషణ చేయటం అవసరం అన్నారు . లాక్డౌన్లవల్ల ప్రయోజనాల కంటే ఆర్ధిక నష్టాలు ఎక్కువ ఉంటాయి అనే విషయాన్నీఅర్ధం చేసుకొన్నా ఆంథోనీ ఫౌసీ కూడా భారత్ పరిస్థి చూసి దేశవ్యాప్తంగా లొక్డౌన్ కు సలహా ఇచ్చారు. భారత్ లో ఎక్కడ పొరపాటు జరిగింది. భారత్ విజయం నుండి విపత్తు వైపు మళ్ళిన మధ్యకాలంలో ఏమిజరిగింది ? దానిపై మే 2న Jerri Lynn తయారు చేసిన .నివేదిక ప్రకారం ” తగినంత టీకాలు,ఉత్పత్తిజరగకపోవటం, మరియు COVID వైరస్ యొక్క కొత్త పోకడల అధ్యయనం సరిగా చేయక పోవటం ,జనజీవనం సాధారణ స్థితికి చేరుకోవటం ; ఆ పరిస్థితిలో వైరస్ పై త్వరగా నియంత్రణ తేవాలని తొందరలో భారత ప్రభుత్వం గతంలో చేసిన చికిత్స మార్గదర్శకాలను నిశ్శబ్దంగా మార్చివేసి . క్రొత్త మార్గదర్శకాలలో తేలికపాటి కోవిద్ రోగులకు ఇచ్చే మందులు సూచించింది దానితో అత్యవసర సంరక్షణ విషయంలోఎక్కడో తేడాలు వచ్చినట్లు”’తెలుస్తున్నది.ఈ స్థితి లోకూడా భారత్ సవాళ్ళను దీటుగా ఎదుర్కోవటానికి తగిన ప్రయత్నాలు చేస్తూనే ఉన్నది వాటిని గమనిద్దాము.
భారత దేశంలో అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తర ప్రదేశ్[220 మిలియన్ల జనాభాఉన్నది ] 2020లో మాదిరిగానే 3,00,000 తేలికపాటి కరోనా కేసులను హోమ్ క్వారంటైన్ ద్వారానే నయం చేయగలిగింది, వ్యాధి సంక్రమణను నివారించడానికి ఐవర్మెక్టిన్ను ఉపయోగించింది. విచారకరమైన వార్త ఏమిటంటే ఉత్తరప్రదేశ్ అనుసరించిన విధానాన్ని జాతీయ విధానంగా తీసుకోకపోవటం, అట్లాగే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వాళ్ళు ఐవర్మెక్టిన్ను దేశవ్యాప్తంగా సిఫారసు చేయడానికి అక్టోబర్లో నే నిరాకరించింది, చాలా మంది హెల్త్ రెగ్యులేటర్ల మాదిరిగానే,ఆలా చేయటానికి మరింత డేటా అవసరం ఉందని పేర్కొంది. గతవారం దాని కారణంగా ఒక్కసారిగా కోవిడ్ -19 కు వ్యతిరేకంగా ఐవర్మెక్టిన్ను దేశవ్యాప్తంగా ఉపయోగించుకునే విషయం నుండి వెనక్కి తిరిగింది ఇది చాల నష్టం చేసింది అని చెప్పవచ్చు, ఎందుకంటే 2020 లో ఆరోగ్య సంరక్షణ కార్మికులకు COVID-19 వ్యాధినివారణకు, వ్యాధి సంక్రమణనను నిరోధించటానికి ఐవర్మెక్టిన్ను ఉపయోగించినవిషయం తెలిసిందే దానిపై 2021 feb లో 4,000 మంది ఆరోగ్య సంరక్షణ కార్మికుల పై అధ్యయనం చేసారు అందులో 83శాతం మందికి ఒక నెలరోజులలోనే తగ్గిందని తేలింది . వ్యాధిని వ్యాధి సంక్రమణ నివారణకు వ్యాక్సిన్తో పాటు తక్కువ-ధర కెమోప్రొఫిలాక్సిస్ చక్కగా పనిచేస్తున్నదని అర్ధమైంది, ,ఆరోగ్యకార్యకర్తలకు తగ్గింది సామాన్యప్రజలకు తగ్గదా ?“COVID-19వ్యాధి నివారణలో ఐవర్మెక్టిన్ మెడిసిన్ పై సమగ్ర విశ్లేషణ జరగాలి దానిని వుపయోగించి ప్రపంచవ్యాప్తంగా ఒక క్రమపద్ధతిలో మోహరించబడాలి. ఐవర్మెక్టిన్ను విస్తృతంగా ఉపయోగించడం ద్వారా ఈ మహమ్మారిని ఒక్కసారిగా అంతం చేయవచ్చు అనేది ఒక అభిప్రాయం ఉన్నది .
భారత్ మీడియా జనాభా లెక్కల పోలిక లేకుండా ఒక అస్పష్టమైం సమాచారాన్ని ప్రసారం చేసి ప్రజలనుం గందరగోళంలో పడేసింది కానీ అమెరికాలో భారత్ కంటే ఏడురెట్లు వ్యాధి సంక్రమణఎక్కువగా జరిగింది 30 రేట్లు మరణాలు ఉన్నాయి . భారత్ లో ఇప్పటి పరిస్థితులకు దారితీసిన కారణాలలో COVID వ్యాక్సిన్ ఉత్పత్తికి భారీ పెట్టుబడులు పెట్టడానికి ప్రాధాన్యత ఇచ్చి చౌకైన జనరిక్లను విస్మరించింది. వ్యాక్సిన్ ఉత్పత్తి పెంచిఇ తరదేశాలకు పంపించి ఆర్ధిక ప్రతిఫలం పొంది ఉండవచ్చు. 1.4 బిలియన్ జనాభాఉన్న దేశంలో అందరికి వ్యాక్సిన్ వేయాలంటే సమయం చాల తీసుకొంటుంది దానిపైనే ద్రుష్టి పెట్టి . రోగనిరోధక శక్తిని పెంచే సప్లమెంట్స్ ను ప్రజలు తీసుకోవటం అపి ఉండవచ్చు. ఈ విషయాలను భారత్ అధ్యనంలో గమనించింది దానికి దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది;దానిలో భాగమే DRDO తయారు చేసిమార్కెట్లోకి తీసుకువచ్చిన చౌకైన మందు. దీనితో సమీపకాలంలోనే భారత్లో పరిస్థితులు కుదుట పడవచ్చు న నే విషయం అందరి దృష్టికి వస్తున్నది. అమెరికా దేశ ప్రధాన వైద్య సలహాదారు ఆంథోనీ ఫౌసీ ఒక సమయంలో భారత్ విధానాలను సంశయించిన భారత్ సరయిన మార్గంలో ఉన్నది అమెరికా కూడా భారత్ మార్గంలో ఆలోచించాలని సూచించాడు,అమెరికా లో ” వైద్య స్వేచ్ఛను పునరుద్ధరించి చౌకైన జనరిక్లనుఉపయోగించటానికి ఉన్న అట్టంకులను తొలగించాలి. ప్రయోగాత్మక దశలో ఉన్న COVID వ్యాక్సిన్లకు FDA ఇంకా ఆమోదం తెలుపలేదు దానిని మిలియన్ల మంది అమెరికన్లు తీసుకోవలి అనే విషయం కంటే సమర్థవంతమైన రోగనిరోధక శక్తి పెంచేందుకు కావలసిన చర్యలు తీసుకోవాలి. గత COVID సంక్రమణ నుండిబయటపడిన లక్షలాది మంది సమర్థవంతమైన రోగనిరోధక శక్తిని కలిగి వారు ఉన్నారు ;మరియు COVID ప్రమాదం లేకుండా మిలియన్ల మంది యువకులు ఆరోగ్యవంతంగాఉన్నారు. ఈ విషయాలను పరిగణలోకి తీసుకొనే రాబోవు రోజులలో తగు జాగ్రత్తలు తీసుకొంటే కోవిద్ మహమ్మారిని తరిమివేయ వచ్చు” అని సూచించాడు.