ప్రపంచదేశాలను వణికిస్తున్న మంకీపాక్స్పై అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికా నిన్న మంకీపాక్స్ ను పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది. మంకీపాక్స్ నివారణకు అధిక నిధులు కేటాయించడంతో పాటు వ్యాక్సిన్ ఉత్పత్తి పెంచాలని నిర్ణయించారు. అమెరికా దేశంలో ఇప్పటికే 6,600 మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి.మంకీపాక్స్ను సీరియస్గా తీసుకుని ప్రజలు తమకు సహకరించాలని అమెరికా ఆరోగ్య శాఖ కోరింది.ప్రపంచవ్యాప్తంగా 25,800 మంకీపాక్స్ కేసులు నమోదైన నేపథ్యంలో వరల్డ్ హెల్త్ ఆర్గనైజషన్ జులై నెలలోనే మంకీపాక్స్ ను హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది. మంకీపాక్స్ నియంత్రణకు తాను కట్టుబడి ఉన్నట్లు అధ్యక్షుడు జో బైడెన్ స్పష్టం చేశారు. టీకా పంపిణీ వేగవంతం చేసి పరీక్షల సంఖ్య పెంచనున్నట్లు తెలిపారు. ఈ వైరస్ వల్ల ముప్పును ప్రజలకు తెలియజేస్తామన్నారు. అందుకే మంకీపాక్స్ను హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించినట్లు తెలిపారు. వైరస్పై పోరాటంలో ఇది చాలా కీలకమన్నారు.
https://twitter.com/POTUS/status/1555330409105424386?s=20&t=415t9mxSTEMnVvxSY4jUxg
మంకీపాక్స్ సోకిన రోగులకు జ్వరం, చర్మంపై దద్దుర్లు రావడంతోపాటు ఈ వ్యాధి వ్యాప్తిచెందుతుండటంతో వైద్యాధికారులు ఆందోళన చెందుతున్నారు. మంకీపాక్స్ సోకిన రోగులను ఐసోలేషన్లో ఉంచాలని, ప్రజలు వారికి దూరంగా ఉండాలని వైద్యులు సూచించారు.