మోదీ గుజరాత్ పర్యటనలో ఓ అనూహ్య ఘటన జరిగింది. రెండురోజులపాటు సొంత రాష్ట్రంలో ఆయన పలు అభివృద్ధికార్యక్రమాలు ప్రారంభించారు. శుక్రవారం ఓ ముఖ్యకార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తుండగా హఠాత్తుగా ఆయన కాన్వాయ్ లోకి ఓ అంబులెన్స్ వచ్చింది. దీంతో మోదీ కాన్వాయ్ ను కాసేపు పక్కకు నిలిపేశారు. ఆంబులెన్స్ ముందుకు వెళ్లిన తరువాత పీఎం కాన్వాయ్ ముందుకు సాగింది. దానికి దారి ఇచ్చేందుకు కొన్ని క్షణాలపాటు నిలిపేసినట్టు తెలుస్తోంది. దాన్ని కొందరు వీడియో తీయగా..అదిప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శుక్రవారం గాంధీనగర్-ముంబై మధ్య నడిచే వందేమాతరం ఎక్స్ ప్రెస్ ను ప్రారంభించిన ప్రధాని అందులో కొంత దూరం ప్రయాణించారు.
https://twitter.com/ANI/status/1575783298344792066?s=20&t=68OdqjXludhjvRwm_3lbMw