అంబానీ ఆఫీసులో అమరీందర్ సింగ్ కు ఏం పని?
ఢిల్లీ శివార్లలో ఆందోళన పేరుతో హైవేల దిగ్బంధానికి వేల మందికి దండులా పంపిన వారిలో అతి ముఖ్యమైన వ్యక్తి అమరీందర్ సింగ్. ఆయన పంజాబ్ సీఎం. కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలనే డిమాండ్ తో ఢిల్లీని ముట్టడించే కుట్రకు ఆద్యుడు ఆయనే అనే ఆరోపణ ఉంది. ఈ ఆందోళకు కర్త కర్మ క్రియ సూత్రధారి తానే అని ఒక వార్తా చానల్ ఇంటర్ వ్యూలో ఆయనే ఒప్పుకొన్నారు. అలాంటి అమరీందర్ సింగ్ తయారు చేసిన ఆందోళనకారులు పంజాబ్ లో అంబానీలకు చెందిన జియో సెల్ ఫోన్ టవర్స్ మీద ప్రతాపం చూపుతున్నారు. కొత్త చట్టాలు అంబానీ వంటి కార్పొరేట్లకు మేలు చేస్తాయన్న అమరీందర్ సింగ్ వంటి నేతల మాటలు రైతులను తప్పుదారి పట్టించాయి.
ఇదంతా నాణేనికి ఒకవైపే. అమరీందర్ సింగ్ కు చెందిన ఒక వీడియో ఇప్పుడు సోషలక మీడియాలో చక్కర్లు కొడుతన్నది. అదే, ముకేష్ అంబానీ ఆఫీసులో అమరీందర్ సింగ్ ఓ మీటింగ్ లో మాట్లాడుతున్న దృశ్యం. అంబానీ అనే పదమే ఒక బూతు అనే విధంగా కాంగ్రెస్ నాయకులు ప్రచారం చేస్తున్నారు. మరి పంజాబీ సీఎం అంబానీని ఆయన ఆఫీసుకు వెళ్లి మరీ ఎందుకు కలిశారు? ఆ మీటింగులో రైతుల నుంచి నేరుగా పంజ ఉత్పత్తులను కొనడం గురించి మాట్లాడారు. కొత్త చట్టాల ప్రకారం రైతులు ఎక్కడైనా ధాన్యం అమ్ముకోవచ్చు. ఇది అన్నదాతకు వరం. కానీ శాపంగా ప్రచారం చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు. మరి అంబానీతో అమరీందర్ సింగ్ ఎందుకు భటీ అయ్యారు? కొత్త చట్టాల ప్రకారం నేరుగా రైతుల నుంచి అంబానీ కంపెనీ పంట ఉత్పత్తులను కొనడం గురించి ఎందుకు చర్చించారు? ఇది డబుల్ స్టాండర్డ్ కాదా? ఈ ప్రశ్నకు పంజాబ్ ముఖ్యమంత్రే జవాబు చెప్పాలి.