భక్తులు ఎంతగానో ఎదురుచూసే అమర్నాథ్ యాత్ర త్వరలో ప్రారంభం కానుంది. ఈ ఏడాది మంచులింగ దర్శనానికి సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఈనెల 11 నుంచి ప్రారంభం కానుంది. జూన్ 30 నుంచి ఆగస్టు వరకు యాత్ర కొనసాగుతుందని అమర్ నాథ్ జీ ష్రైన్ బోర్డ్ సీఈవో నితీశ్వర్ కుమార్ తెలిపారు. కొవిడ్ మహమ్మారి తరువాత ప్రారంభం కానున్న ఈ యాత్రకు బోర్డు అన్ని ఏర్పాట్లు ఇప్పటికే చేసింది.
జమ్మూలోని రాంబన్ నుంచి ప్రారంభంకానున్న ఈ యాత్రకు సుమారు మూడు లక్షల మంది భక్తులు వస్తారని అక్కడి అధికారులు అంచనా వేస్తున్నారు. జమ్మూ కశ్మీర్ బ్యాంక్, పీఎన్బీ బ్యాంక్, యెస్ బ్యాంకులకు చెందిన సుమారు 446 బ్రాంచీల్లో, అలాగే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన 100 బ్రాంచీల్లో రిజిస్ట్రేషన్కు చేసుకునే వీలుకల్పించారు ఈసారి.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.)