పవిత్ర అమర్నాథ యాత్ర జులై ఒకటోతేదీన ప్రారంభం కానుంది. 62 రోజుల పాటు సాగే యాత్ర ఆగస్టు 31 వరకు కొనసాగుతుందని అమర్నాథ్ ష్రైన్ బోర్డ్ ప్రకటించింది. వెళ్లాలనుకునేవారు ఈనెల 17 నుంచి ఆన్ లైన్, ఆఫ్ లైన్లో పేర్లను రిజిస్టర్ చేసుకోవచ్చు. మంచులింగానికి వెళ్లే రెండు దారుల్లోనూ ఒకేసారి యాత్ర ప్రారంభం కానుంది. అనంత్నాగ్ జిల్లా పహల్గాం మార్గం, గందేర్బల్ జిల్లా బల్తాల్ మార్గాల్లో ఒకదాన్ని యాత్రికులు ఎంచుకోవచ్చు. ఇక యాత్రికుల కోసం… వాతావరణ పరిస్థితులు సహా ఎప్పటికప్పుడు తాజా సమాచారం తెలుసుకోవడానికి గూగుల్ ప్లే స్టోర్లో శ్రీఅమర్నాథ్జీ యాప్ను అందుబాటులోకి తీసుకువస్తున్నట్టు జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా వెల్లడించారు.