టీఆర్ఎస్ , బీజేపీ నాయకుల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. తెలంగాణ బీజేపీ చీఫ్ బండిసంజయ్ పై మరోసారి విరుచుకుపడ్డారు మంత్రి కేటీఆర్. తాను డ్రగ్స్ తీసుకుంటానని సంజయ్ పదే పదే ఆరోపిస్తున్నారని..నిరూపించలేకపోతే చెప్పుతీసుకుని కొడతానని అన్నారు. టెస్టు కోసం రక్తం ఇచ్చేందుకు సిద్ధమని..అవసరమైతే గోళ్లు, కిడ్నీ కూడా ఇస్తానని తాను డ్రగ్స్ తీసుకున్నట్టు నిరూపణ కాకపోతే కరీంనగర్ చౌరస్తాలో తనతో చెప్పుదెబ్బలు తినేందుకు సంజయ్ సిద్ధమా అని సవాల్ విసిరారు.