కరోనా వైరస్ మహమ్మారిపై పోరాటంలో పాలనా యంత్రాంగానికి సహకరిస్తున్న ఆర్మీ సిబ్బందిని
చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ ప్రశంసించారు. పోరుకోసం సదా సంసిద్ధంగా ఉండాలనీ పిలుపునిచ్చారు.
మహమ్మారిని కట్టడి చేసేందుకు అవసరమైన చర్యలను నిర్ణీత సమయంలో చేపట్టాలని సకాలంలో స్పందించడం ముఖ్యమనీ అన్నారు. త్రివిధ దళాల్లో పనిచేస్తున్నవారంతా అంకితభావంగలవారని, శక్తి సామర్థ్యాలుగలవారని అన్నారు ‘‘మనం చేయగలం, మనం చేస్తాం. బాగా చేశారు, కొనసాగించండి, మనం ప్రయాణించవలసిన దూరం ఇంకా చాలా ఉంది’’ అని రావత్ సందేశంఇచ్చారు.కరోనా వ్యాప్తి ప్రమాదకరంగా మారిన పరిస్థితుల్లో రాష్ట్రప్రభుత్వాలకు త్రివిధ దళాలతోపాటు…రక్షణ మంత్రిత్వ శాఖలోని పలు విభాగాలు సహకారం అందిస్తున్నాయి. అందులో భాగంగా భారత వాయు సేన విమానాలు ఖాళీ ఆక్సిజన్ ట్యాంకులను శుక్రవారం నుంచి ఫిల్లింగ్ స్టేషన్లకు తీసుకెళ్తున్నాయి. అత్యవసర మందులను, పరికరాలను రవాణా చేస్తున్నాయి.