వామపక్ష ప్రచార వెబ్సైట్ ఆల్ట్ న్యూస్ కో ఫౌండర్, నకిలీ వార్తలు ప్రచారం చేసే మహమ్మద్ జుబేర్ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. 2020 కేసులో విచారణ కోసం స్పెషల్ సెల్ ద్వారా మొహమ్మద్ జుబేర్ను పిలిపించి అరెస్ట్ చేశారు. తగిన సాక్ష్యాలను రికార్డు చేసిన తర్వాత జుబైర్ను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. తదుపరి రిమాండ్ కోసం అతడిని డ్యూటీ మేజిస్ట్రేట్ ముందు హాజరు పరుస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నివేదికల ప్రకారం, ఇండియన్ పీనల్ కోడ్ లోని సెక్షన్ 153, 295A కింద కేసు నమోదైంది.
2020 కేసులో విచారణ కోసం జుబైర్ను ఢిల్లీలోని స్పెషల్ సెల్ పిలిచింది. హైకోర్టు ఆర్డర్స్ తెచ్చుకుని అరెస్ట్ నుంచి ప్రొటెక్షన్ పొందాడు.అయితే ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా విచారణ అంటూ పిలిచి అరెస్ట్ చేశారని…అసలు ఎఫ్ఐఆర్ కాపీ కూడా అడిగితే ఇవ్వలేదని అతని ఫ్రెండ్ సిన్హా ట్వీట్ ద్వారా తెలిపాడు.
Please note. pic.twitter.com/gMmassggbx
— Pratik Sinha (@free_thinker) June 27, 2022
బీజేపీ మాజీ జాతీయ అధికార ప్రతినిధి నూపుర్ శర్మపై అత్యాచారం చేస్తామని, చంపేస్తామని బెదిరించేలా…తోటి ఇస్లామిస్టులను ప్రేరేపించిన వ్యక్తి జుబైర్. ఇస్లామిస్ట్ జుబైర్ మే 27న ట్విటర్లో శర్మ టీవీ చర్చకు సంబంధించిన వీడియో క్లిప్ను వక్రీకృత వ్యాఖ్యతో షేర్ చేసాడు. దాంతో ఇస్లాంవాదులు చెలరేగిపోయి నూపుర్ ను బెదిరించారు.
ఈ నెల ప్రారంభంలో చేసిన ట్వీట్ కోసం తనపై నమోదైన ఎఫ్ఐఆర్ను సవాల్ చేస్తూ మహ్మద్ జుబైర్ చేసిన పిటిషన్ను అలహాబాద్ హైకోర్టు కొట్టివేసింది. జుబేర్ తన ట్వీట్లో 3 హిందూ సాధువులైన యతి నరసింహానంద సరస్వతి, బజరంగ్ ముని సహా ఆనంద్ స్వరూప్లను ‘ద్వేషపూరిత వ్యక్తులు’ అని పిలిచాడు. ఈ నెల ప్రారంభంలో జుబైర్పై ఇండియన్ పీనల్ కోడ్ లోని సెక్షన్ 295-A, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం 2000లోని సెక్షన్ 67 కింద ఉత్తరప్రదేశ్ పోలీసులు కేసు నమోదు చేశారు. అలహాబాద్ హైకోర్టు అతనిపై దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ను రద్దు చేయడానికి నిరాకరించడంతో, జుబైర్ తన ఫేస్బుక్ అకౌంట్ ను తొలగించాడు.
ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ సైబర్ యూనిట్ ఆల్ట్ న్యూస్ ఫ్యాక్ట్ చెకింగ్ వెబ్సైట్ కో ఫౌండర్ మహ్మద్ జుబైర్ను అరెస్టు చేసిన ఒక రోజు తర్వాత, గత మూడు నెలల్లో అతని ఖాతాలో 50 లక్షల రూపాయలకు పైగా వచ్చినట్లు పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. యూపీఐ ఐడీ నుంచి డబ్బు బదిలీ అయింది. దేనికి ఉపయోగించారు అనేదానితో సహా ఈ లావాదేవీలను దర్యాప్తు చేస్తామని ఢిల్లీ పోలీసులు ఈరోజు తెలిపారు. జుబేర్ కూడా చాలా విరాళాలు అందుకున్నాడని వర్గాలు తెలిపాయి. ఈ విరాళాలు ఎవరు ఇచ్చారు, ఎందుకుఇచ్చారు మొదలైన అంశాలపై విచారణ జరుపుతామని పోలీసులు తెలిపారు. జుబైర్ను ఇంకొంత కాలం కస్టడీ కోరే అవకాశం ఉంది.