తెలుగు టాప్ హీరో అల్లు అర్జున్ కు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చురకలు అంటించారు. జనసేన పార్టీ వ్యవహారాలలో పవన్ కళ్యాణ్ తో పాటు మెగా ఫ్యామిలీ లోని నాగబాబు రామ్ చరణ్ మాత్రమే చురుకుగా వ్యవహరించారు. అప్పట్లో ప్రజారాజ్యం పార్టీ ఉన్నప్పుడు,, అంతా తానే నడిపించిన అల్లు అరవింద్… జనసేన హడావిడి కి దూరంగానే నిలుస్తున్నారు. పైగా మొన్నటి ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ వ్యక్తిగత పరిచయాలు అంటూ వైసీపీ నేతలు తరఫున ప్రచారం చేశారు అప్పుడే పవన్ కళ్యాణ్ తో అల్లు అర్జున్ కు చెడింది అన్న టాక్ కూడా వినిపించింది.
ఇటీవల జనసేన పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ అల్లు కుటుంబ సభ్యులు పెద్దగా హడావిడి చేసింది ఏమాత్రం లేదు. తాజాగా అల్లు అర్జున్ ని ఉద్దేశించి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొన్ని సంచలన కామెంట్లు చేశారు. పుష్ప సినిమాలో చెట్లు నరికేసే స్మగ్లర్ క్యారెక్టర్ ను అల్లు అర్జున్ పోషించారు. ఈ సినిమాను వంకపెట్టుకొని పవన్ కళ్యాణ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాజాగా పవన్ కళ్యాణ్ కర్ణాటకలో పర్యటిస్తున్నారు. అక్కడ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. అనంతరం ఆ రాష్ట్ర అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ బి ఖండ్రే భేటి అయ్యారు..
దీనికి ముందు అక్కడి మీడియాతో మాట్లాడుతూ, తెలుగు సినిమాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుతం వస్తున్న సినిమాల్లో అడవులను నరికివేస్తున్నారని అన్నారు. ఇటువంటి కథలను ఎంచుకోవడం బాధాకరం అని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. దివంగత కన్నడ నటుడు రాజ్ కుమార్ నటించిన చిత్రం గంధడగుడి సినిమా తనకు బాగా ఇష్టం అని ఆయన చెప్పుకొచ్చారు. ఈ సినిమా థీమ్ ఏమిటి అంటే అడవులను కాపాడడం అని వివరించారు. ఇలాంటి సినిమాల్లో నటించాలి అని తనకు కోరిక ఉంది అని ఆయన పేర్కొన్నారు.
ఇంతకుముందు సినిమాల్లో హీరోలు అడవులని కాపాడేవారు అని,, కానీ ఈరోజుల్లో గొడ్డళ్లు పట్టుకొని, స్మగ్లింగ్ చేయడం, అడవులను నరికివేయడం హీరోయిజం అయిపోయింది అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేశారు. ఇటువంటి సినీ పరిశ్రమలో ఉన్నానని అప్పుడప్పుడు బాధగా అనిపిస్తుంటుంది అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటివి తగ్గి మళ్లీ అడవుల ప్రాముఖ్యత తెలిసేలా సినిమాలు రావాలని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు.
మొత్తం మీద ఈ కామెంట్ లు పుష్ప సినిమా గురించి అనీ, అల్లు అర్జున్ ని ఉద్దేశించి అని అందరికీ అర్థం అవుతోంది. దీనిని బట్టి మెగా ఫ్యామిలీ నుంచి అల్లు ఫ్యామిలీ అంతకంతకు దూరం కావడం ఖాయం అని తెలుస్తోంది.