ఆంధ్రప్రదేశ్ కొత్త మంత్రులకు శాఖలను కేటాయించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తర్వాత ప్రాధాన్యత కల్పిస్తూ ఉప ముఖ్యమంత్రి హోదాను పవన్ కళ్యాణ్ కు ఇచ్చారు. అదే మాదిరిగా ఎక్కువ సంఖ్యలో మంత్రిత్వ శాఖలను కూడా పవన్ కి ఇవ్వడం జరిగింది.
పవన్ కళ్యాణ్ ఎక్కువగా ఇష్టపడే గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖలు అప్పగించారు. త్వరలోనే ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి ఈ నేపథ్యంలో గ్రామాల్లో తెలుగుదేశం కూటమి బలపడే విధంగా పంచాయతీరాజ్ శాఖ ను పరుగులు పెట్టించాల్సిన బాధ్యత పవన్ మీద ఉంటుంది . అదే సమయంలో ఎన్నికలకు ముందు గ్రామాల్లో పనిచేస్తున్న వాలంటీర్ల మీద పవన్ కళ్యాణ్ ఘాటుగా విమర్శలు చేశారు ఒకానొక దశలో తమ ప్రభుత్వం వచ్చాక వాలంటీర్లను అందర్నీ ఇంటికి పంపించేస్తామని ఆయన చెప్పడం జరిగింది. ఇది తీవ్రంగా కలకలం సృష్టించడంతో తెలుగుదేశం పార్టీ నుంచి నష్ట నివారణ చర్యలు చేపట్టారు. వాలంటీర్లను తొలగించేది లేదని వారి వేతనం కూడా పదివేలకు పెంచుతామని టిడిపి హామీ ఇచ్చింది. అయితే వైసిపి నియమించిన వాలంటీర్లను యధావిధిగా కొనసాగిస్తారా లేక కొత్తవారిని నియమించుకుంటారు అనేది సస్పెన్స్ గా ఉంది.
మరోవైపు జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ తో పాటు నాదెండ్ల మనోహర్ కందులు దుర్గేష్ మంత్రి పదవులు దక్కించుకున్నారు. మీ ఇద్దరికీ కూడా ప్రాధాన్యత గల మంత్రిత్వ శాఖలను ఇచ్చారు. గ్రామ ప్రజల అవసరాలు తీర్చే పౌర సరఫరాల శాఖను నాదెండ్ల మనోహర్ కి పర్యాటక శాఖను కందులు దుర్గేష్ కి అప్పగించారు. సినిమాటోగ్రఫీ శాఖను పవన్ కళ్యాణ్ కి ఇస్తారు అని ఊహా గానాలు వచ్చినప్పటికీ, దానిని జనసేన పార్టీకే చెందిన కందుల దుర్గేష్ కు అప్పగించారు. తద్వారా పవన్ కు మొహమాటలు పెట్టి ఇబ్బంది పెట్టే పరిస్థితి లేకుండా తప్పించారు.
భారతీయ జనతా పార్టీ నుంచి ఒకే ఒక్క మంత్రి సత్య కుమార్ యాదవ్ కు ఆరోగ్య శాఖను అప్పగించారు. ఏబీవీపీ నుంచి పార్టీలో పైకి ఎదుగుతూ వచ్చిన సత్యకుమార్ ఢిల్లీ ప్రభుత్వంతో గట్టి సంబంధాలు కలిగి ఉన్నారు.
హోం మంత్రిత్వ శాఖను వంగలపూడి అనితకు అప్పగించారు.
గత వైసీపీ ప్రభుత్వంలో దళిత మహిళను హోమ్ మంత్రి చేసామని పదేపదే చెప్పుకునేవారు. అదే క్రమంలో దళిత మహిళ మంత్రి వంగలపూడి అనితకు హోంశాఖ కేటాయించడం జరిగింది. శాసనసభలో లెక్కలు చెబుతూ ప్రసంగాలు చేసే పయ్యావుల కేశవ్కు ఆర్థిక శాఖను అప్పగించడం జరిగింది. చంద్రబాబు తనయుడు నారా లోకేష్ ఊహించినట్లుగానే ఐటీ శాఖను తీసుకున్నారు . మానవ వనరుల శాఖను దగ్గర ఉంచుకున్నారు.
పారిశ్రామిక కుటుంబం నుంచి వచ్చిన వైశ్య వర్గం నేత టీజీ భరత్ కు పరిశ్రమల శాఖను అప్పగించారు. మంత్రిమండలిలోని ఏకైక మైనార్టీ మంత్రి ఎన్ ఎమ్ డి ఫరూక్ కు మైనార్టీ సంక్షేమ శాఖను అప్పగించారు.
మంత్రుల శాఖల వివరాలు ఇలా ఉన్నాయి.
చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి – జనలర్ అడ్మినిస్ట్రేషన్ , లా & ఆర్డర్, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ , మంత్రులకు కేటాయించని అన్ని శాఖులు
పవన్ కల్యాణ్ : డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, అటవీ, పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలు
నారా లోకేష్ : మానవ వనరులు అభివృద్ధి, ఐటీ ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ శాఖలు
అచ్చెన్నాయుడు : వ్యవసాయశాఖ
నాదెండ్ల మనోహర్ : ఆహారం, పౌరసరఫరాల శాఖ
వంగలపూడి అనిత : హోం మంత్రిత్వ శాఖ
పొంగూరు నారాయణ : పురపాలకశాఖ, పట్టణాభివృద్ధి
సత్యకుమార్ యాదవ్ : ఆరోగ్యశాఖ
నిమ్మల రామానాయుడు : నీటిపారుదల శాఖ
మహ్మద్ ఫరూఖ్ : న్యాయశాఖ, మైనారిటీ సంక్షేమం
ఆనం రామనారాయణరెడ్డి : దేవాదాయ శాఖ
పయ్యావుల కేశవ్ : ఆర్థిక శాఖ
అనగాని సత్యప్రసాద్ : రెవెన్యూ శాఖ
కొలుసు పార్థసారథి: హౌసింగ్, I &PR శాఖలు
డోలా బాలవీరాంజనేయస్వామి: సాంఘిక సంక్షేమ శాఖ
గొట్టిపాటి రవికుమార్ : విద్యుత్ శాఖ
కందుల దుర్గేష్ : పర్యాటకం, సాంస్కృతిక శాఖలు
గుమ్మడి సంధ్యారాణి : స్త్రీ, శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమ శాఖలు
బీసీ జనార్థన్ : రహదారులు, భవనాల శాఖలు
టీజీ భరత్: పరిశ్రమల శాఖ
ఎస్.సవిత : బీసీ సంక్షేమం, హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్స్ శాఖలు