కేరళ జర్నలిస్ట్ సిద్దిఖ్ కప్పన్ విడుదలను ఘనంగా సెలబ్రేట్ చేసుకుంది ఇస్లామిక్ సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా PFI. 2020 అరెస్టైన సిద్ధిఖ్ కు గతవారం సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఉత్తరప్రదేశ్లోని హత్రాస్ లో దళిత బాలికపై జరిగిన సామూహిక అత్యాచారం, హత్య ఘటన కవరేజీ కోసం వెళ్తుండగా పోలీసులు అరెస్ట్ చేశారు. కులాలు, మతాల మధ్య విభజన తెచ్చేలా ఘటనను వాడుకునేందుకే అతను యూపీ వచ్చాడని పోలీసులు తెలిపారు.
తాజాగా కప్పన్ కు బెయిల్ రావడంతో అతని టీంమొత్తం సంబరాలు చేసుకుంటోంది.న్యాయంకోసం గొంతిప్పే సిద్ధిఖ్ కు బెయిల్ మంజూరు చేసిన సుప్రీం నిర్ణయం ప్రశంసనీయమని పీఎఫ్ఐ చేర్మన్ ఓఎంఎం సలాం ఓ ప్రకటన విడుదల చేశారు. న్యాయవ్యవస్థపై నమ్మకం పెంచేలా కోర్టు నిర్ణయం ఉందని ట్వీట్ చేశాడు సలాం. దేశంలో కులాలు, మధ్య అల్లర్లు రేపేందుకు బయటిశక్తుల నిధులతో పీఎఫ్ఐ నడుస్తోందనే ఆరోపణలున్నాయి. అటు కప్పన్ ఈ కేసులో అతని అత్యంత సన్నిహితుడైన రషీదుద్దీన్ ఆలపట్టా సాక్షులను బెదిరించినట్టు ఆరోపణలు వచ్చాయి. జన్మభూమి పత్రికలో కథనం కూడా వచ్చింది. రషీదుద్దీన్ మీడియా వన్ మాజీ ఢిల్లీ బ్యూరో చీఫ్. మనోరమ ప్రతినిధితో పాటు మరో ఇద్దరు జర్నలిస్టులకూ బెదిరింపులు వచ్చాయని తెలిసింది. కప్పన్ కేసులో సాక్ష్యం చెబుతున్న సాక్షులకు ‘తీవ్ర పరిణామాలు’ అనే బెదిరింపుతో ఫేస్ బుక్ పోస్ట్ కూడా పెట్టారు.
Bail to Siddique Kappan a source of relief: Popular Front#ReleaseAllPoliticalPrisoners #PopularFrontOfIndia #SiddiqueKappan pic.twitter.com/cc7K9CFeqY
— Popular Front of India (@PFIOfficial) September 9, 2022
రెండేళ్లక్రితం హత్రాస్ లో పర్యటన సందర్భంగా కూడా మనోరమ, ఇతర మీడియా సంస్థల పాత్రికేయులే యూపీ పోలీసులకు తనగురించి చెప్పినట్టు కప్పన్ తన భార్యతో చెప్పినట్టు రషీద్ తెలిపాడు. గతంలో కశ్మీరీ ఉగ్రవాదులను ఇంటర్య్వూ చేసిన నేపధ్యం రషీదుద్దీన్ ది. ఇకకప్పన్ కు కొన్ని షరతులతో సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అతని పాస్ పోర్టును అప్పగించడంతోపాటు… రెగ్యులర్గా పోలీస్ స్టేషన్ కు హాజరుకావాలని ఆదేశించింది.