సోనియా గాంధీ పర్సనల్ అసిస్టెంట్ పీపీ మాధవన్పై అత్యాచార ఆరోపణలపై కేసు నమోదైంది.71 ఏళ్ల మాధవన్పై కేసు నమోదు చేసినట్టు డిల్లీ పోలీసులు తెలిపారు. జూన్ 25న డిల్లీ ఉత్తమ్ నగర్ పోలీస్ స్టేషన్లో నమోదైన ఫిర్యాదు మేరకు కేసు ఫైల్ అయింది. పెళ్లి, ఉద్యోగం పేరుతో ప్రలోభపెట్టి తనపై అత్యాచారం చేశారని బాధితురాలి ఆరోపణ. అయితే తనపై వచ్చిన ఆరోపణల్నిమాధవన్ కొట్టిపారేశారు. తనపై కుట్రర జరుగుతోందని వాపోయారు. బాధితురాలి భర్త డిల్లీలోని కాంగ్రెస్ కార్యాలయంలో పనిచేసేవాడు. 2020లో చనిపోయాడు.
బాధితురాలు దాఖలు చేసిన ఎఫ్ఐఆర్లో పేర్కొన్నట్లుగా, మాధవన్ ఆమెను ఉద్యోగం ఇప్పిస్తానంటూ…ఢిల్లీలోని సుందర్ నగర్లోని ఇంటికి పిలిచాడు. మాధవన్ తన భార్యకు విడాకులు ఇచ్చాడని.. బాధితురాలిని వివాహం చేసుకుంటానని చెప్పినట్లు అందులో ఉంది. కోవిడ్-19 తర్వాత ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న మహిళ ఈ ప్రతిపాదనకు అంగీకరించింది. నాటినుంచి వీడియోకాల్ ద్వారా ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండేవారని ఫిర్యాదులేఖలో ఉంది.
మాధవన్ ఒక రోజు తన పరిమితులను దాటి, ఉత్తమ్ నగర్ మెట్రో స్టేషన్ టెర్మినల్ వద్ద తనను కలవమని బాధితురాలిని కోరాడు. స్టేషన్లో ఆగి ఉన్న వాహనంలో మాధవన్ ఆమెను బలవంతంగా ఎక్కించుకుని అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆతరువాత మరోసారీ తనను బలవంతంగా కార్లో ఎక్కించుకెళ్లాడని బాధితురాలు ఆరోపించింది. వేధింపులు భరించలేకే ఫిర్యాదు చేసినట్టు పోలీసుల ఎదుట వాపోయింది. అంతేకాదు తనకు రక్షణ కల్పించాలని పోలీసులను అభ్యర్థించింది.