చెప్పేవి గొప్పలు చేసేవీ శూన్యం అన్నట్టుగా రాష్ట్రప్రభుత్వ 2023-24 బడ్జెట్ ఉందన్నారు మాజీ ఆర్థికమంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. కేసీఆర్ పాలనలో ప్రతీ రంగం కూడా అస్తవ్యస్తం అయిందని… సరైన కేటాయింపులే జరగడం లేదని విమర్శించారు. నాలుగేళ్లైనా రైతు రుణమాఫీ చేయలేదన్న ఈటల… అత్యధిక ఎగవేత దళారులుగా రైతులపై ముద్ర పడుతుందన్నారు. అంగన్ వాడీలకు డబ్బు సరిగా ఇవ్వకపోవడంతో ముక్కిపోయిన బియ్యంతో భోజనం పెడుతున్నారని అన్నారు. గురుకులలో సరైన వసతులు లేవని.. విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. మన ఊరు మన బడి కేవలం చెప్పడానికే రంగురంగులుగా కనిపిస్తుందని వ్యాఖ్యలు చేశారు.
చెప్పేవి కొండంత, చేసేవి గోరంత – కేసీఆర్ పాలనలో అన్ని రంగాలూ అస్తవ్యస్తం – ఈటల
Share: