అగ్నిపథ్ పథకం మీద ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ చేస్తున్న ప్రచారాలు మీద విమర్శలు వినిపి స్తున్నాయి ముఖ్యంగా సైనిక వర్గాలు పూర్తిగా రాహుల్ ని తప్పుపడుతున్నాయి. తప్పుడు ప్రచారాలు చేసి దేశ ప్రతిష్టను దిగజార్చను వద్దు అని హితవు పలుకుతున్నాయి.
ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉపాధి కార్యక్రమాల్లో అగ్నిపథ్ ఒకటి. సైనిక బలగాల్లో యువత ప్రవేశాలను పెంచేందుకు దీనిని నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అగ్నిపథ్ కింద ఎంపికైన యువతకు ఎన్నెన్నో ఆఫర్లు అందిస్తూ వస్తోంది. ఇటు నిరుద్యోగ యువతకు అటు సైనిక వ్యవస్థకు ఇది చాలా చాలా ఉపయోగకరం.
కానీ,, ఇటీవల కాలంలో అనేక వేదికల మీద అగ్ని పథ్ పథకం గురించి రాహుల్ గాంధీ నోరు పారేసుకుంటున్నారు. అసలు రాహుల్ గాంధీ విమర్శలు ఏమిటి దానికి సైనిక వర్గాల సమాధానం ఏమిటి అనేది చూద్దాం.
1. బీమా
రాహుల్ గాంధీ: అగ్నివీర్లకు బీమా కేవలం రూ. 45 లక్షలు అయితే సాధారణ జవాన్లకు రూ. 75 లక్షలు.
వాస్తవం: అగ్నివీర్లకు వారి నుంచి ఎటువంటి కంట్రిబ్యుషన్ లేకుండా రూ. 48 లక్షల బీమా కవరేజి చేస్తూ పూర్తిగా ప్రభుత్వమే నిధులు సమకూర్చుతుంది. కాగా, సాధారణ సైనికులకి రూ.50 లక్షల భీమా కోసం నెలకు రూ.5,000 తీసుకుంటుంది.
2. ఎక్స్ గ్రేషియా
రాహుల్ గాంధీ: అగ్నివీర్లకు లభించే ఎక్స్-గ్రేషియా రూ.44 లక్షలు. అయితే సాధారణ జవాన్లకు రూ.55 లక్షలు.
వాస్తవం: అగ్నివీర్లకు లభించే రూ. 44 లక్షలు, అయితే, అమర జవాన్ల అత్యంత దగ్గరి రక్తసంబంధీకులు లేదా చట్టబద్ధమైన వారసులకు (NOK) రూ. 25 లక్షలు (డ్యూటీపై), రూ. 35 లక్షలు (CI Ops / HAA), రూ.45 లక్షలు (యుద్ధం అమరులైతే…).
3. జీతం బకాయిలు
రాహుల్ గాంధీ: అగ్నివీర్లు 4 సంవత్సరాల వరకు జీతం బకాయిలను పొందుతారు, అయితే సాధారణ జవాన్లు పదవీ విరమణ వరకు (15+ సంవత్సరాలు) పొందుతారు.
వాస్తవం: రెగ్యులర్ జవాన్ల NoK (రక్తసంబంధీకులు లేదా చట్టబద్ధమైన వారసులు)లకు జీతం బకాయిలు చెల్లించే విధానమే లేదు, ఇక 15 సంవత్సరాల చెల్లింపు ఊసే లేదు.
4. కుటుంబ పెన్షన్
రాహుల్ గాంధీ: అగ్నివీరులకు పెన్షన్ సౌకర్యం లేదు, అయితే సాధారణ జవాన్లు జీతంలో 100% పెన్షన్ పొందుతారు.
వాస్తవం : సాధారణ జవాన్ల NoK (రక్తసంబంధీకులు లేదా చట్టబద్ధమైన వారసులు) సాధారణ కుటుంబ పెన్షన్ (చివరి వేతనంలో 50% 10 సంవత్సరాల పాటు… ఆ తర్వాత 30%), విధి నిర్వహణలో మరణించినందుకు ప్రత్యేక కుటుంబ పెన్షన్ (చివరి వేతనంలో 60%) మరియు ఆపరేషన్స్లో మరణించినప్పుడు సరళీకృత కుటుంబ పెన్షన్ అందుకుంటారు (చివరి చెల్లింపులో 100%).
5. గ్రాట్యుటీ
రాహుల్ గాంధీ: సాధారణ జవాన్లు 20 లక్షల వరకు గ్రాట్యుటీని పొందుతారు కానీ, అగ్నివీర్లు ఎటువంటి గ్రాట్యుటీకీ అర్హులు కాదు.
వాస్తవం: రెగ్యులర్ జవాన్ల గ్రాట్యుటీ అనేది వారు చివరిగా డ్రా చేసిన జీతంపై ఆధారపడి ఉంటుంది, ఇక JCO స్థాయిలో రూ.10-12 లక్షల వరకు ఉంటుంది.
6. పరిగణించవలసిన అంశాలు –
(ఎ) సేవ నుండి విరమణ అయినప్పుడు అగ్నివీర్లు రూ. 10.04 లక్షల సేవా నిధి ప్యాకేజీని అందుకుంటారు (వ్యక్తిగత కంటిబ్యుషన్ రూ. 5.02 లక్షలతో పాటు ప్రభుత్వం ద్వారా మిగతా మొత్తం) దానిపై వచ్చే వడ్డీ.
(బి) రెగ్యులర్ క్యాడర్లోకి నియామకాలు అగ్నివీర్ల నుంచి కూడా జరుగుతాయి. వాళ్ల మెరిట్ని బట్టి తీసుకుంటారు.
(సి) 4 సంవత్సరాల కాలం పూర్తయిన తర్వాత, అగ్నివీర్ల నైపుణ్యం రెండు స్థాయిలు పెరుగుతుంది.
(డి) సైనికులకు లభించే ప్రయోజనాలను తప్పుగా చిత్రీకరించడం, అనవసర రాజకీయాల వల్ల సైనికుల మనోధైర్యం దెబ్బతినే ప్రమాదం ఉంది. భవిష్యత్తులో ఈ పథకంలో చేరాలనుకున్న వ్యక్తులు కూడా పై వ్యాఖ్యల ద్వారా ప్రతికూలంగా ప్రభావితమవుతారు. దేశ భద్రతకు ఈ రెండు పరిణామాలు హానికరం.
(ఇ) మీడియా నివేదికల ప్రకారం, వివిధ మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేట్ రంగం వారు అగ్నివీర్ల నాలుగేళ్ల కాలం తర్వాత వారిని ఉద్యోగాలలోకి తీసుకుంటామని హామీ ఇచ్చాయి.
మరి ఇంత స్పష్టంగా సైనిక నిపుణులు సమాధానాలు చెబుతున్నప్పటికీ కాంగ్రెస్ మాత్రం తీరు మార్చుకోవడం లేదు. దేశ ప్రతిష్టను దిగజార్చేందుకు ఉన్న మార్గాలని కాంగ్రెస్ అన్వేషిస్తోంది అని విమర్శకులు అంటున్నారు.
<blockquote class=”twitter-tweet”><p lang=”en” dir=”ltr”>*CLARIFICATION ON EMOLUMENTS TO AGNIVEER AJAY KUMAR* <br><br>Certain posts on Social Media have brought out that compensation hasn't been paid to the Next of Kin of Agniveer Ajay Kumar who lost his life in the line of duty.<br><br>It is emphasised that the Indian Army salutes the supreme… <a href=”https://t.co/yMl9QhIbGM”>pic.twitter.com/yMl9QhIbGM</a></p>— ADG PI – INDIAN ARMY (@adgpi) <a href=”https://twitter.com/adgpi/status/1808541708248101276?ref_src=twsrc%5Etfw”>July 3, 2024</a></blockquote> <script async src=”https://platform.twitter.com/widgets.js” charset=”utf-8″></script>