“భారతదేశంలోని ప్రతి ఒక్కరూ హిందువుగానే జన్మించారు. ఇక్కడి వారంతా హిందువులే. హిందుత్వం అతి ప్రాచీరమైనది” అని మాట్లాడిన కాంగ్రెస్ మాజీ నేత గులాం నబి ఆజాద్ మాటలను విశ్వహిందూ పరిషత్ (VHP) స్వాగతిస్తోంది. హిందుత్వం వేద కాలం నుంచి, లక్షల సంవత్సరాల చరిత్ర కలిగిన పరంపర హిందూ ధర్మం అని తమ సంస్థ పదేపదే సమాజానికి తెలియజేస్తూ వస్తోందని పేర్కొంది. ప్రస్తుతం ఇదే విషయాన్ని గులాం నబీ ఆజాద్ కూడా సమర్థించడం శుభపరిణామమని విశ్వహిందూ పరిషత్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు శ్రీ సురేందర్ రెడ్డి, శ్రీ పండరినాథ్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ మేరకు శుక్రవారం వారు ఓ ప్రకటన విడుదల చేశారు. భారతదేశంలో విదేశీయులు చేసిన పాలన దుర్మార్గాల వల్ల ఈ దేశంలో తీవ్రమైన మతమార్పిడి జరిగిందని ఆరోపించారు. ఆంగ్లేయులు, మొగలాయిల పరిపాలన కాలంలో హిందువులను నయానా , భయానా మతం మార్చారని వివరించారు. మతం మారని హిందువులను ఘోరాతి ఘోరంగా హింసించి చంపేశారని ఆవేదన వ్యక్తం చేశారు. డెమొక్రటిక్ ఆజాద్ పార్టీ అధినేత గులాం నబీ ఆజాద్ మాటల్లో వంద శాతం వాస్తవం ఉందన్నారు. “1500 ఏళ్ల క్రితం ఇస్లాం మతం ఆవిర్భవించింది. రెండువేల సంవత్సరాల క్రితం క్రైస్తవ మతం పురుడుపోసుకుంది. కానీ హిందూ మతం అతి ప్రాచీనమైనది,అత్యంత ప్రముఖమైనది” అనే విషయం ఆజాద్ మాటల ద్వారా నైనా సమాజం వాస్తవం తెలుసుకోవాలన్నారు. “విదేశాల్లో పుట్టి వచ్చిన ముస్లింలు కొందరు మొగల్ సైన్యంలో పనిచేసి ఉండవచ్చు.. వారు పదో, పాతికో ఉంటారు.. కానీ లక్షల కొద్ది సైన్యంలోని వారంతా హిందూ, సిక్కు మతాల నుంచి ఇస్లాం మతంలోకి మారిన వారే” అని చెప్పిన ఆజాద్ అక్షర సత్యాలని పేర్కొన్నారు. హిందువులుగా పుట్టిన వారు పాలకుల ఒత్తిడి కారణంగా మతమార్పిడి పద్ధతిలో ఇస్లాం, క్రైస్తవ మతాల్లోకి మారారు అనేది వాస్తవమన్నారు. బలవంతపు మత మార్పిడి పద్ధతిలోనే భారతదేశంలో ఇస్లాం, క్రైస్తవం ఉనికి సంపాదించాయి అనేది కాదనలేని నిజమన్నారు. ప్రాచీన భారతదేశంలో పూర్వం నుంచి ఆచరిస్తున్న సంప్రదాయాలపై పాలకుల ముసుగులో వచ్చిన రాజులు చేసిన మతమార్పిడి కారణంగానే నేడు హిందూ సమాజం పై తీవ్ర ప్రభావం చూపుతోందనే విషయం ప్రజలు గమనించాలని విశ్వహిందూ పరిషత్ నేతలు కోరారు. ముఖ్యంగా చెప్పాలంటే 600 సంవత్సరాల క్రితం కాశ్మీర్ ప్రాంతంలో ముస్లిం అనే వాడు లేడు.. కానీ అక్కడ ఉన్నటువంటి కాశ్మీర్ పండితులను భయపెట్టి, ప్రలోభాలకు గురిచేసి మత మార్పిడి చేసిన విషయం చరిత్ర సాక్షాలు మనకు చెబుతున్నాయని గణాంకాలతో సహా గులాం నబీ ఆజాద్ గారు వివరించడం ప్రతి హిందువు స్వాగతించాల్సిన అంశమని పేర్కొన్నారు. ఇప్పటికైనా సమాజం కళ్ళు తెరిచి మతమార్పిడి రాక్షస ప్రక్రియను సమర్థవంతంగా ఎదుర్కోవాలని హిందూ ప్రజలకు విశ్వహిందూ పరిషత్ నేతలు పిలుపునిచ్చారు.
Former Congress leader Ghulam Nabi Azad-
Hindu Religion is much older than Islam in India. Muslims in our country are because of Conversion from Hindus and in Kashmir all Muslims were converted from Kashmiri Pandits. Everybody is born in Hindu Dharma only. pic.twitter.com/trWqUyFzrs
— Megh Updates 🚨™ (@MeghUpdates) August 16, 2023