భారతీయ ముస్లింలను బాధితులుగా చిత్రీకరించే మరో ప్రయత్నంలో జర్నలిస్ట్ అర్ఫా ఖాణుమ్ షేర్వానీ తలమునకలైంది. భారతదేశంలోని హిందువులను నేరస్థులుగా చూపించడానికి ప్రయత్నించారు. అర్ఫా, ది వైర్ అనే యూట్యూబ్ ఛానెల్లో ఒక వీడియోను పోస్ట్ చేసింది. దీనిలో భారతదేశంలో హిందూ పండుగల సందర్భంగా ఇటీవల జరిగిన హింసాత్మక సంఘటనలకు, హిందువులు బయటకు వచ్చి క్షమాపణలు చెప్పాలని ఆమె కోరారు. సెప్టెంబరు 11, 2001 నాటి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో జరిగిన దాడుల తర్వాత ముస్లింలు వ్యవహరించిన విధంగా ముందుకు రావాలని, వారిలా ప్రవర్తించమని అర్ఫా ఖానుమ్ వీడియోలో భారతదేశంలోని హిందూ మెజారిటీ జనాభాను కోరుతున్నారు. హిందువుల శోభాయాత్రల్లో రాళ్లు విసిరిన.. పోలీసులపై దాడి చేసిన ముస్లింలను కూడా ఆమె బాధితులుగా చెబుతూ…వారికి అండగా ఉండాలనీ కోరారు.
For the Hindu community in India, it is a 9/11 moment.
The way global Muslim community condemned the violence in the name of their religion, it is time for Hindus to actively dissociate themselves from the anti-Muslim violence and discrimination being carried out in their name. pic.twitter.com/5tHTPSTGiq— Arfa Khanum Sherwani (@khanumarfa) April 23, 2022
ముస్లింలను బాధితులుగా చూపుతూ హిందువులను కించపరిచేలా అర్ఫా చేసిన వ్యాఖ్యలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. దేశవ్యాప్తంగా పండుగలు జరుపుకుంటున్న హిందువులపై ముస్లింలు దాడి చేశారు. అందుకు సాక్ష్యాలున్నాయి. పోలీసులూ దాడిలో గాయపడ్డ సందర్భాలున్నాయి. అయినా రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఢిల్లీ ఏ ప్రాంతమైనా.. పండుగలు జరుపుకోవడంలో బిజీగా ఉన్న హిందువులపై ముస్లిం నివాసితులు దాడి చేశారని అందరికీ తెలిసిన విషయమే.
భారతీయుల వైఖరి గురించి అంతర్జాతీయ సమాజానికి తెలుసంటూ ఏదేదో చెప్పే ప్రయత్నం చేసింది.
హింసపై మొత్తం నిందలు హిందువులపై వేయడానికి అర్ఫా నేర్పుగా ప్రయత్నించింది. హిజాబ్ వ్యవహారంలో కర్నాటకలో హర్షను ఇస్లామిస్టులు హత్య చేస్తే క్షమాపణ చెప్పమని అర్హా ముస్లింలను అడగలేదు. ఇప్పుడేమో బాధితులు హిందులైతే..ముస్లింలను విక్టిమ్స్ గా చూపే ప్రయత్నం చేస్తోంది.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.)