తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ఆసక్తి రేపుతోంది. ఈ పర్యటనలో ముఖ్యమంత్రి వెంట డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సీనియర్ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి ఉన్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ అధిష్టానం పెద్దలతో దఫ దఫాలుగా భేటీలు జరుగుతున్నాయి. దీనిని బట్టి తెలంగాణలో ముఖ్యమైన పదవుల భర్తీ చేపడతారు అని తెలుస్తోంది.
ముఖ్యంగా పిసిసి అధ్యక్ష పదవి లో కొత్త నాయకుడిని తీసుకొని వస్తారని తెలుస్తోంది. సెప్టెంబర్ మాసం తర్వాత తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి స్థానిక సంస్థల ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి అగ్నిపరీక్ష గా మారాయి ప్రాథమికంగా గ్రామాల్లో టిఆర్ఎస్ పార్టీ కేడర్ను చాలా వరకు కాంగ్రెస్ లో కలిపేస్తున్నారు . రాగల స్థానిక ఎన్నికల్లో ఈ కలయికలు బాగా కలిసి వస్తాయి అని అంచనా వేస్తున్నారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో అసెంబ్లీ ఎన్నికలతో పాటు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ బలమైన ప్రభావం చూపించగలిగింది దీనికి తోడు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా రేవంత్ నాయకత్వంలోనే కాంగ్రెస్ విజయడంకా మోగిస్తుంది అని అంచనా వేస్తున్నారు. ఫలితంగా ముఖ్యమైన పదవుల పంపిణీలో రేవంత్ రెడ్డి మాట నెగ్గటం ఖాయగా కనిపిస్తోంది.
కాంగ్రెస్ పార్టీలో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవి కోసం పోటీ ఎక్కువగా ఉంది. ఇప్పుడు ఉన్న లెక్కల ప్రకారం ముఖ్యమంత్రి పదవి తర్వాత ఎక్కువ అధికార కేంద్రంగా పిసిసి అధ్యక్షుడు కనిపించే అవకాశం ఉంది. ఈ సీటు కోసం చాలామంది కాంగ్రెస్ సీనియర్లు పోటీపడుతున్నారు.
పిసిసి అధ్యక్షునిగా రేవంత్ రెడ్డి సూచించే వ్యక్తికే బాధ్యతలు అప్పగించే అవకాశం కనిపిస్తోంది. అలాగే మంత్రివర్గ విస్తరణ , ముఖ్యమైన పదవుల భర్తీ మీద రేవంత్ రెడ్డి ఫోకస్ చేస్తున్నారు. దీంతో తెలంగాణ రాజకీయాల్లో రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ఆసక్తికరంగా మారింది.