తెలంగాణలో విద్యార్థులకు కొత్త న్యూస్ వచ్చేసింది. రాష్ట్రంలోని అన్ని డిగ్రీ కళాశాల ల ప్రవేశం కోసం నిర్వహించే డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ ఏడాది మూడు విడతల్లో ప్రవేశాలకు షెడ్యూల్ చేశారు . ఇంటర్మీడియట్ లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలి.
మొదటి విడత రిజిస్ట్రేషన్ లను మే నెల 6 నుంచి 25 దాకా నిర్వహిస్తారు. 200 రూపాయలు రుసుముతో దరఖాస్తు చేసుకోవాలి. మే 15 నుంచి 27 దాకా వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవాలి
జూన్ 3 నుంచి సీట్లు కేటాయింపు చేపట్టి పదో తేదీ దాకా సెల్ఫ్ రిపోర్టింగ్ అవకాశం ఇచ్చారు.
రెండో దశ రిజిస్ట్రేషన్ ల కోసం జూన్ 4 నుంచి 13 దాకా 400 రూపాయలతో దరఖాస్తు చేసుకోవాలి. దీనికోసం జూన్ 4 నుంచి 14 దాకా వెబ్ ఆప్షన్స్ ఉంటాయి . జూన్ 18న రెండో దశ కేటాయింపు చేపట్టి, జూన్ 19 నుంచి 24 దాకా సెల్ఫ్ రిపోర్టింగ్ అవకాశమిచ్చారు.
మూడో దశ జూన్ 19 నుంచి 25 వరకు రిజిస్ట్రేషన్లు తీసుకుంటారు. 400 రూపాయలు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి. జూన్ 19 నుంచి 25 దాకా మూడో దశ వెబ్ ఆప్షన్స్ ఉంటాయి. జూన్ 29 మూడో దశ సీట్ల కేటాయింపు ఉంటుంది. నెలాఖరు లోగా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. జూలై 8 నుంచి డిగ్రీ కళాశాల తరగతులు మొదలవుతాయి. ఈ ఏడాది నాలుగున్నర లక్షల సీట్లు అందుబాటులో ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.