కరోనా మహమ్మారి దేశ వ్యాప్తంగా మళ్లీ విజృంభిస్తోంది. రోజురోజుకు రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గతేడాది తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడు ఎలా కేసులు నమోదయ్యాయో.. ఇప్పుడు మళ్లీ అదే రేంజ్లో కేసులు నమోదవుతుండటంతో కలకలం రేపుతోంది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 81,466 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా నుంచి కోలుకుని 50,356 మంది డిశ్చార్జ్ అయ్యారు. కాగా, కరోనా బారినపడి 469 మంది మరణించారు. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా కరోనా బారినపడి 1,63,396 మంది మరణించినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 6,14,696 యాక్టివ్ కేసులు ఉన్నాయని.. ఇక వ్యాక్సినేషన్ డ్రైవ్ కూడా వేగవంతంగా కొనసాగుతోందని అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 6.87 కోట్ల మందికి వ్యాక్సినేషన్ వేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
India reports 81,466 new #COVID19 cases, 50,356 discharges, and 469 deaths in the last 24 hours, as per the Union Health Ministry.
Total cases: 1,23,03,131
Total recoveries: 1,15,25,039
Active cases: 6,14,696
Death toll: 1,63,396Total vaccination: 6,87,89,138 pic.twitter.com/QkmQxfpsNB
— ANI (@ANI) April 2, 2021