తాను ఇటీవల సైన్ అప్ చేసిన పొగాకు బ్రాండ్కు ఇకపై బ్రాండ్ అంబాసిడర్గా ఉండబోనని అక్షయ్ కుమార్ ప్రకటించారు. గురువారం అర్ధరాత్రి తర్వాత అక్షయ్ తన సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని ప్రకటించారు. అజయ్ దేవగన్, షారూఖ్ ఖాన్ తర్వాత విమల్ సంస్థ ఏలకుల ఉత్పత్తుల కోసం ప్రోమోలలో తాజాగా నటించారు బాలీవుడ్ స్టార్ అక్షయ్. ఇది పొగాకు ఉత్పత్తులను కూడా విక్రయించే బ్రాండ్. అతని నిర్ణయాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోయారు.
విమల్ బ్రాండ్ కోసం ఇటీవలి ప్రకటనలో షారూఖ్, అజయ్ దేవగన్ అక్షయ్ను ‘విమల్ యూనివర్స్ ’కి స్వాగతిస్తున్నట్లు చూపించారు. అందరూ విమల్ కు సెల్యూట్ కొట్టి, ఎలైచి (ఏలకులు) తిన్నట్లు ఆ వీడియో లో ఉంది. హానికరమైన ఉత్పత్తిని ప్రచారం చేయడంపై అక్షయ్ అభిమానులు అసంతృప్తితో ఉన్నారు. ఆటను ఇది వరకు ఒకసారి ఆల్కహాల్, సిగరెట్లు సహా ఇతర ఉత్పత్తుల పట్ల అతనికి ఉన్న విరక్తి గురించి అతను మాట్లాడిన పాత వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు నెటిజన్లు.
దీనిపై అక్షయ్ స్పందిస్తూ.. “నన్ను క్షమించండి. నా అభిమానులకు, శ్రేయోభిలాషులకు నేను క్షమాపణలు చెప్పాలనుకుంటున్నా. గత కొన్ని రోజులుగా మీ స్పందన నన్ను తీవ్రంగా ప్రభావితం చేసింది. నేను పొగాకును ఎప్పటికీ ఆమోదించను. విమల్ సంస్థతో నా కలయికపై మీ అభిప్రాయాలను గౌరవిస్తున్నాను. ఈ విషయంలో వినయంతో వెనక్కి తగ్గానని ప్రకటిస్తున్నాను. నేను మొత్తం ఎండార్స్మెంట్ రుసుమును ఒక విలువైన కారణానికి ఉపయోగించాలని నిర్ణయించుకున్నాను. ఒప్పందం ప్రకారం చట్టపరమైన వ్యవధి వరకు బ్రాండ్ ప్రకటనలను ప్రసారం చేయడం కొనసాగించవచ్చు, అయితే నా భవిష్యత్తు ఎంపికలలో నేను చాలా జాగ్రత్తగా ఉంటానని వాగ్దానం చేస్తున్నాను. ప్రతిఫలంగా నేను మీ ప్రేమ, ఆశీస్సులను ఎప్పటికీ ఆశిస్తూనే ఉంటాను”అని పోస్ట్ చేశారు.
https://twitter.com/akshaykumar/status/1516862694833360897?s=20&t=Lo6M1aR6Ni3IDsPubaVsJw
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.)