నూపుర్ శర్మను అవమానిస్తూ ట్వీట్ చేసిన అఖిలేష్ చిక్కుల్లో పడ్డారు. ఆయన చేసిన ట్వీట్ …మహిళా ద్వేషాన్ని ప్రస్ఫుటం చేస్తోందని జాతీయ మహిళా కమిషన్ అభిప్రాయపడింది. ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ… కమిషన్ ఛైర్మన్ రేఖాశర్మ యూపీ డీజీపీకి లేఖ రాశారు.
ఇప్పటికే నూపుర్ బెదిరింపులు ఎదుర్కొంటున్నారని.. ఆమె ప్రాణాలకే ముప్పు ఉందని ఈ సమయంలో నూపుర్ శర్మపై దాడి చేయాలన్నట్టు రెచ్చగొట్టేలా ఆయన ట్వీట్ చేశారని కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసులో ఎలాంటి చర్యలు తీసుకుంటారో మూడు రోజుల్లోగా తెలియజేయాలని యూపీ పోలీసులను కోరింది మహిళా కమిషన్.
నూపుర్ శర్మ పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు ఆమెను మందలిస్తూ కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అప్పుడే ఆమెను అవమానించేలా అఖిలేశ్ ట్వీట్ చేశారు. దేశంలో సామరస్యానికి విఘాతం కలిగించేలా ప్రవర్తించిన నూపుర్ నోటికే కాదు శరీరానికీ బుద్ధి చెప్పాలి, శిక్షించాలి అని జులై 1న ట్వీట్ చేశారు అఖిలేశ్.
सिर्फ़ मुख को नहीं शरीर को भी माफ़ी मांगनी चाहिए और देश में अशांति और सौहार्द बिगाड़ने की सज़ा भी मिलनी चाहिए। pic.twitter.com/KaQXIAutrt
— Akhilesh Yadav (@yadavakhilesh) July 1, 2022
ఈ ట్వీట్ పై నెటిజన్లు సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా ద్వేషం కనిపిస్తోందని అఖిలేష్ పై మండిపడ్డారు. నూపుర్ పై అత్యాచారం జరగాలనో లేదా ఆమె తలను నరకాలని ఆయన అనుకుంటున్నారా అని నిలదీశారు. ఆ ట్వీట్ చూసి సుమోటాగా స్పందించారు. ఆ ట్వీట్ నూపుర్ శర్మపై దాడిని ప్రేరేపించేలా ఉందని ఆమె మండిపడ్డారు.