రిలయన్స్ జియో పగ్గాలు తనయుడు ఆకాశ్ కు అప్పగించారు ముఖేశ్ అంబానీ. జియో డైరెక్టర్ గా ఆయన రాజీనామా చేశారు. స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్లో, రిలయన్స్ జియో కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల ఛైర్మన్గా నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆకాష్ అంబానీని నియమించడాన్ని కంపెనీ బోర్డు సమావేశంలో ఆమోదించినట్లు తెలిపారు. 2022 జూన్ 27 నుంచి ప్రారంభమయ్యే ఐదేళ్ల కాలానికి రిలయన్స్ జియో మేనేజింగ్ డైరెక్టర్గా పంకజ్ మోహన్ పవార్ నియామకాన్ని బోర్డు తన సమావేశంలో ఆమోదించింది. TRAI డేటా ప్రకారం భారతదేశపు అతిపెద్ద టెలికాం ఆపరేటర్ రిలయన్స్ జియో ఏప్రిల్లో 16.8 లక్షల మంది మొబైల్ సబ్స్క్రైబర్లతో అగ్రస్థానంలో ఉంది.
అయితే రిలయన్స్ జియో సహా అన్ని జియో డిజిటల్ సేవల బ్రాండ్లను కలిగి ఉన్న జియో ప్లాట్ఫారమ్ల లిమిటెడ్ ఛైర్మన్గా ముఖేష్ అంబానీ కొనసాగుతారు. యూఎస్లోని బ్రౌన్ యూనివర్శిటీ నుంచి ఎకనామిక్స్ లో గ్రాడ్యుయేషన్ చేశాడు ఆకాశ్. డేటా, టెక్నాలజీని అందరికీ అందుబాటులోకి తీసుకురావడానికి ఆకాశ్ కొంతకాలంగా కృషి చేస్తున్నారని..ఇక ముందూ ఆదేపనిలో ఉంటారని కంపెనీ తెలిపింది.