మహారాష్ట్రలో విపక్షనేతగా ఎన్సీపీ నేత అజిత్ పవార్ ఎంపికయ్యారు. 288 మంది ఉన్న సభ్యుల సభలో ఎన్సీపీ అతిపెద్ద ప్రతిపక్ష పార్టీగా అవతరించిందని, అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా పవార్ బాధ్యతలు స్వీకరిస్తారని స్పీకర్ రాహుల్ నర్వేకర్ ప్రకటించారు.
అంతకుముందు రోజు మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే, అతని మిత్రపక్షం బీజేపీ మద్దతుతో మహారాష్ట్ర అసెంబ్లీలో విశ్వాస పరీక్షలో విజయం సాధించారు. విశ్వాస పరీక్ష మహారాష్ట్ర 20వ ముఖ్యమంత్రిగా.. బాలాసాహెబ్ ఠాక్రే సిద్ధాంతంపై ఆధారపడిన నిజమైన శివసేన నాయకుడిగా ఆయన స్థానాన్ని ఖరారు చేసింది.