అమెరికాలోని టెక్సాస్లో ఓ దుండగుడు జరిగిన కాల్పులకు బలైన తెలంగాణ యువతి తాటికొండ ఐశ్వర్య మృతదేహం స్వదేశానికి చేరింది. 27 ఏళ్ల ఐశ్వర్య .. శనివారం తన స్నేహితుడితో కలిసి టెక్సాస్లోని ఓ మాల్కు షాపింగ్కు వెళ్లింది. 3.36 గంటల సమయంలో.. అగంతుకుడి కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయింది
ఐశ్వర్య స్వగ్రామం సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మునిసిపాలిటీ పరిధిలోని పాతనేరేడుచర్ల. ఆమె తండ్రి తాటికొండ నర్సిరెడ్డిరంగారెడ్డి జిల్లా కమర్షియల్ కోర్టు జడ్జిగా పనిచేస్తున్నారు. వారి కుటుంబం ప్రస్తుతం హైదరాబాద్ సరూర్నగర్లోని హుడాకాలనీలో నివాసం ఉంటోంది. హైదరాబాద్లోని మాతృశ్రీ ఇంజనీరింగ్ కళాశాలలో ఇంజనీరింగ్ పూర్తి చేసిన ఐశ్వర్య.. ఉన్నత చదువుల కోసం 2018లో అమెరికా వెళ్లింది. ఈస్టర్న్ మిషిగన్ యూనివర్సిటీలోని గ్రాండ్ స్కూల్లో కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్లో ఎమ్మెస్ పూర్తి చేసి, టెక్సస్ సమీపంలోని పర్ఫెక్ట్ జనరల్ కాంట్రాక్టర్స్ కంపెనీలో ప్రాజెక్ట్ ఇంజనీర్గా పనిచేస్తోంది. మాల్కు వెళ్లే ముందు తన తల్లికి ఫోన్ చేసి మాట్లాడిన ఐశ్వర్య ఐదునిమిషాలకే తుపాకీతూటాలకు బలైంది.