వాయుసేనకు మరింత తేజసం
నేషన్ ఫస్ట్ అనేది ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నినాదం. భారత్ శత్రుదుర్భేధ్య దేశం కావాలనేది ఆయన విధానం. కాబట్టే గత ఆరేండ్లలో భారతీయ సైనిక బలగాకు గతంలో ఎన్నడూ లేనంద ఆధునిక సాధన సంపత్తిని, ఆయుధాలను సమకూర్చిపెట్టారు. అత్యంత శక్తివంతమైన రాఫెల్ యుద్ధవిమానాలు కూడా వచ్చిచేరాయి. ఇప్పుడు దేశీయంగానే మరిన్ని తేజస్ యుద్ధ విమానాలను వాయుసేనకు అందివ్వాలని మోడీ సర్కార్ నిర్ణయించింది.
హిందూస్థాన్ ఎయిరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ ఎ ఎల్)కు భారీ ఆర్డర్ ఇవ్వడానికి ప్రభుత్వం పచ్చజెండా చూపింది. ఏకంగా 48 వేల కోట్ల రూపాయలతో తేలికపాటి తేజస్ యుద్ధ విమానాలను కొనే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. అంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు మరో 83 తేజస్ జెట్స్ సమకూరుతాయి. రక్షణ రంగంలో నిధులకు ఏ లోటు లేకుండా మోడీ ప్రభుత్వం చకచకా నిర్ణయాలు తీసుకుంటున్నది. గతంలో డిఫెన్స్ డీల్ అంటే బోలెడు అవినీతి ఆరోపణలు వచ్చేవి. కానీ మోడీ హయాంలో అందుకు అవకాశమే లేదు. కర్మమోగి మోడీ పాలనలో నవభారతం మరింత బలం పెంచుకుంటున్నది. జయహో భారత్.