భారత్ కు చెందిన వరల్డ్ రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్ చేసిన పరిశోధనలో పీఎం ఉజ్వల యోజన కారణంగా ఒక్క ఏడాదిలోనే ప్రతి ఇంటిలో వంటింట్లో వెలువడే పొగ కారణంగా సంభవించే మరణాల రేటు 13 శాతానికి తగ్గిందని తేలింది. 2019 సంవత్సరంలోనే 1.5 లక్షల కాలుష్య సంబంధిత అకాల మరణాలను ఈ పథకం నిరోధించిందని పేర్కొంది. పీఎం ఉజ్వల యోజన అత్యంత ప్రభావవంతమైన ప్రభుత్వ పథకాలలో ఒకటి, ఇది గాలి నాణ్యతను మెరుగుపరచడంలో, వాయు కాలుష్యం నుండి ఆరోగ్య ప్రమాదాలను తగ్గించడంలో సహాయపడింది.
ఇతర వనరులను ఉపయోగించే కుటుంబాలను పరిగణనలోకి తీసుకుంటే.. 2019లో ఇంట్లోని వాయు కాలుష్య సంబంధిత మరణాలు 10.2 లక్షలకు పెరిగాయని బృందం అంచనా వేసింది. అయితే ఈ పథకం లేనట్లయితే.. మరణాల సంఖ్య 11.7 లక్షల వరకు ఉండేదని నివేదిక పేర్కొంది. నాగ్పూర్ లో జరిపిన సర్వేలో గ్రామీణ కుటుంబాల్లో 65% మంది మాత్రమే ప్రాథమిక వంట ఇంధనంగా ఎల్పిజిని ఉపయోగిస్తున్నారని కూడా తెలిసింది.
https://twitter.com/smritiirani/status/1504703677529214979?t=yGZogywf5TO-LmXyAOOFYQ&s=19
దేశంలోని గ్రామీణ, నిరాశ్రయులైన కుటుంబాలకు LPG వంటి వంట ఇంధనాన్ని అందుబాటులో ఉంచడానికి పెట్రోలియం, నేచురల్ గ్యాస్ మంత్రిత్వ శాఖ 2016లో ప్రధాన మంత్రి ఉజ్వల యోజనను ప్రవేశపెట్టింది. అప్పటి వరకూ ఈ గ్రామీణ నిరుపేద కుటుంబాలు సాంప్రదాయ వంట ఇంధనాలైన కట్టెలు, బొగ్గు, ఆవుపేడ పిడకలు సహా ఇతర వాటిని ఉపయోగిస్తున్నారు.
WHO అంచనాల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా ప్రతీ 10 మందిలో 9 మంది అధిక స్థాయి కాలుష్య కారకాలతో కూడిన గాలిని పీల్చుకుంటున్నారు. దాదాపు 3 బిలియన్ల మంది ప్రజలు కిరోసిన్, బయోమాస్ (చెక్క, జంతువుల పేడ, పంట వ్యర్థాలు) తోపాటు బొగ్గు ద్వారా ఇంధనంగా ఉపయోగించి వంట చేస్తారు.
https://twitter.com/IndianOilcl/status/1496096556914982913?t=jwXD7_gMB5X6xMWaDk65KQ&s=19