ఎయిరిండియాను టాటా గ్రూపునకు అప్పగించే ప్రక్రియను కేంద్రం పూర్తి చేసింది. ఎయిరిండియా-స్పెషల్ పర్పస్ వెహికిల్ AIAHL మధ్య కుదిరిన ఒప్పందాన్ని ప్రభుత్వం నోటిఫై చేసింది. ఇక రేపటి నుంచి అంటే శుక్రవారం నుంచి ఎయిరిండియా కార్యకలాపాలు పూర్తిగా టాటా గ్రూప్ ఆధ్వర్యంలోనే సాగుతాయి. దాదాపు 69 ఏళ్ల తరువాత ఎయిరిండియాను టాటా గ్రూప్ సొంతం చేసుకుంది. ఉదయమే ఎయిరిండియా బోర్డు చివరగా సమావేశమైంది. టాటా గ్రూప్ నకు సంస్థను అప్పగిస్తున్నందున బోర్డు రాజీనామా చేసింది. ఎయిరిండియా అమ్మకానికి రూ.18,000 కోట్లకు టాటా గ్రూప్తో ప్రభుత్వం గత ఏడాది షేర్ పర్చేజ్ అగ్రిమెంట్పై సంతకాలు చేసింది. టాటా గ్రూప్ రూ.2,700 కోట్లు నగదు రూపంలో ప్రభుత్వానికి చెల్లించి, రూ.15,300 కోట్ల మేరకు అప్పులను స్వాధీనం చేసుకుంది.
ఎయిరిండియా స్వాధీనంతో విమానయాన రంగంలో దాదాపు 27 శాతం మార్కెట్ వాటాను కలిగియుండే సంస్థగా టాటా గ్రూప్ మారబోతోంది. దేశీయంగా 57 గమ్యస్థానాలకు వైమానిక సేవలను అందిస్తోందీ సంస్థ. నాలుగు ఖండాల్లోని 33 దేశాలకు కూడా సేవలందిస్తోంది.