మహారాష్ట్రలో మరో జిల్లా పేరు మారింది. అహ్మద్ నగర్ జిల్లా పేరును అహల్యానగర్ గా మారుస్తూ షిండే సర్కారు నిర్ణయం తీసుకుంది. ఇకనుంచి అహ్మద్ నగర్ ను అహల్యానగర్ గా పిలవాలంటూ రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేసిన సీఎం షిండే… త్వరలోనే పేరు మార్పుపై అధికారిక ఉత్తర్వులిస్తామన్నారు. రాణి అహల్య మాల్వా సామ్రాజ్యపు హోల్కర్ వంశపు రాణి.అహ్మద్ నగర్ జిల్లాలోని చౌందీ గ్రామంలో ఆమె జన్మించారు. వలసపాలకుల దాడులతో ధ్వంసమైన కాశీ, అయోధ్య, మధుర, సోమనాథ్ వంటి ఎన్నో ఆలయాలను ఆమె పునరుద్ధరించారు. నిన్న రాణీ అహల్య జయంతి సందర్భంగా ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఇంతకుముందున్న శివసేన-కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం కూడా…దిగిపోయేముందు రెండు జిల్లాల పేర్లను మార్చింది. ఔరంగాబాద్ ను శంభాజీనగర్ గా, ఉస్మానాబాద్ పేరును ధారాశివ్ గా మార్చింది. ఈ ఏడాది ఫ్రిబ్రవరిలో కేంద్రం ఆ పేర్లమార్పునకు ఆమోదముద్ర వేసింది.