ఒడిశాకు 4,000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగల అణ్వాయుధ సామర్థ్యం గల అగ్ని-IV బాలిస్టిక్ క్షిపణిని భారత్ సోమవారం విజయవంతంగా పరీక్షించింది. స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ ఆధ్వర్యంలో జరిగే సాధారణ శిక్షణా ప్రయోగాలలో భాగంగా ఈ పరీక్షను నిర్వహించినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.
“ఇంటర్మీడియట్-రేంజ్ బాలిస్టిక్ మిస్సైల్ అయిన అగ్ని-4 ట్రైనింగ్ ప్రయోగంను నిన్నసాయంత్రం 7.30 గంటలకు ఒడిశాలోని APJ అబ్దుల్ కలాం ద్వీపం నుంచి నిర్వహించారు. ఈ ప్రయోగం అన్ని కార్యాచరణ పారామీటర్లను, సిస్టమ్ విశ్వసనీయతను ధృవీకరించింది”అని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. అయితే
అంతగా తెలియని వారికి అగ్ని-IV అనేది అగ్ని శ్రేణి క్షిపణులలో నాల్గవ ఎడిషన్. అంతకుముందు అగ్ని II ప్రైమ్ అని పిలిచేవారు. ఈ అణు సామర్థ్యం గల క్షిపణిని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ DRDO అభివృద్ధి చేసింది.
2021 సంవత్సరంలో భారత్ 1,000 నుంచి 2,000 కిలోమీటర్ల మధ్య లక్ష్యాలను చేధించే అణు సామర్థ్యం గల వ్యూహాత్మక అగ్ని ప్రైమ్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. కొత్త సాంకేతికతలు, సామర్థ్యాలను అవలంబించడం ద్వారా భారత్ తన వ్యూహాత్మక క్షిపణుల ఆయుధశాలను మరింత బలోపేతం చేసే ప్రక్రియలో ఉందని తెలిసిందే.