మన మీడియా, విదీశీ మీడియా పని కట్టుకుని ప్రపంచ వ్యాప్తంగా హిందువులను ఎలా టార్గెట్ చేస్తోందో ఈ స్లైడ్స్ ద్వారా చూడండి. ఇది ఇప్పుడు మొదలు అయింది కాదు. దశాబ్దాలుగా జరుగుతోంది. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తరువాత ఈ మీడియా ద్వంద ప్రమాణాలు ఎండ గట్టే అవకాశం వచ్చింది.
కొన్ని ఉదాహరణలు చూడండి.
1. మత ఘర్షణలు జరిగితే, మీడియా నిష్పక్షపాతంగా రాయాలి అంటే…రెండు వర్గాలు మధ్య గొడవలు అని రాయాలి లేదా రెండు వర్గాలు పేర్లు రాయాలి. కానీ మీడియా రిపోర్ట్ చేస్తున్నది ఒకసారి నిశితంగా పరిశీలిస్తే హిందు సంఘాల వల్ల ఆ గోడవలు మొదలు అయితే అదే హెడ్ లైన్స్ పెట్టి హిందూ అన్న పదం హై లైట్ చేస్తారు. అదే మైనార్టీ వర్గం అల్లర్లు మొదలు పెడితే రెండు గ్రూపులు ఘర్షణ పడ్డాయి అని రాస్తారు.
2. అలాగే దాడులు, మానభంగాలు వార్తలు రాస్తున్నప్పుడు కూడా ఇదే పంథా అనుసరిస్తున్నారు. దళితుల మీద దాడికి హిందూ అగ్రవర్ణాలు కారణం అయితే హిందూ ధర్మంలో కుల వ్యవస్థను హై లైట్ చేస్తూ వార్తలు మరియు వ్యాసాలు. అదే నిందితుడు మైనార్టీ మతానికి చెందితే నిందితుల పేర్లు కానీ మతం పేరు కానీ రాయరు.
3. ఒక హిందూ గురువు అనగా నిత్యానంద లేదా జగ్గీ వాసుదేవ్ లు ఏదైనా తేడాగా మాట్లాడితే హిందూ ధర్మాన్ని గురువులను హేళన చేస్తూ వార్తలు, వ్యాసాలు, మిమ్స్. అదే ముల్లాలు, పాస్టర్లు అంతకంటే దారుణంగా మాట్లాడినా పూర్తి మౌనం వహిస్తుంది మీడియా..
4..హిందూ పండుగలకు, పూజలకు పర్యావరణం, కాలుష్యం, వృధా అని సూక్తులు మాట్లాడే ఈ మీడియా వారు మిగతా వారి పండుగలకు పూర్తి మౌనం వహిస్తారు.
ఎదో ఒకటో రెండో పొరపాటున జరిగి ఉండవచ్చు అని సరిపెట్టుకోలేని విధంగా ఇవి వరుసగా ఒక అజెండా ప్రకారం జరుగుతున్నాయి.
ఇప్పటికే మీడియాలో పాతుకు పోయి తమ భావజాలాన్ని, అజెండాలను దశాబ్దాలుగా మెజార్టీ ప్రజలపై బలవంతంగా రుద్దుతూ వస్తున్న ప్రముఖ పత్రికా సంపాదకులు, వ్యాసకర్తలు సోషల్ మీడియా వచ్చిన తరువాత ఈ మెయిన్ స్ట్రీమ్ మీడియా అజెండాలు సామాన్య ప్రజలు బయటపెడుతూ ఉండడటం తో తట్టుకోలేక ఇటువంటి వారిని తిరిగి ట్రోల్స్ గా ముద్ర వేస్తున్నారు తప్పితే తమ తప్పులను సరిదిద్దుకునే ప్రయత్నాలు చేయడం లేదు. అందుకే ప్రజల్లో పూర్వం బాగా గౌరవం పొందిన ఈ మీడియా వారు అదే ప్రజలచే అపహాస్యం చేయబడుతున్నారు.
ఇది వారి స్వయంకృతాపరాధం…
ఈ క్రింది విదీశీ మీడియా ఉదాహరణలు చూడండి.
~ Chada Shastry